Showing posts with label యెహోవా. Show all posts
Showing posts with label యెహోవా. Show all posts

మనతో(సంఘముతో) కలసి తండ్రిని ఆరాధించుటకు యేసు వస్తారా?



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


మన ప్రభువైన యేసు మాటలు ప్రకారముగా... 1. ఆరాధన కోరిన దేవుడు తండ్రియైన దేవుడు(యెహోవా) అని, 2. ఈ భూనివాస కాలములో తాను ఎన్నడూ ఆరాధింపబడలేదని, ఆరాధనను కోరలేదని,  తానే శరీరధారియైయున్న దినములలో యూదులలో ఒకడుగా తన దేవున్ని ఏటేటా మరియు ఉత్సవ కాలము నందు  ఆరాధించారని, అనేక విషయాల్లో మనకు మాదిరి చూపారని వ్రాయబడిన ఇట్టి సత్యాన్ని మీరు స్పష్టముగా చదివి అంగీకరించారని సంతోషిస్తూ ఇలా క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను బట్టి, మీ విషయమై మన తండ్రియైన దేవునికి  కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 🙇‍♂️🙇‍♀️ 


అవును.., ✅ ప్రభువైన యేసు శరీరధారియైయున్న దినములలో ధర్మశాస్త్రం ప్రకారముగా యెహోవా దేవున్ని ఆరాధన చేశారనేది వాస్తవమే... కానీ ఇప్పుడు కాదని, అది అప్పుడని, యూదుడుగా పుట్టాడు కాబట్టే చేశారని, క్రైస్తవులకు మాదిరి చూపుటకై చేశాడని, తనకు తానే చేసుకున్నాడని, ద్విపాత్రాభినయం చేశారని, మరికొంత మంది సత్యాన్ని జీర్ణించుకోలేక  యెహోవా దేవుడే శరీరధారియై యేసుగా వచ్చాడని అనగా త్రిత్వము, త్రియేక బోధలు వంటివి...Etc. ఇలాంటి కల్పనాకథలను బోధించే, వినేవారు కూడా నేటి కాలములో లేకపోలేదు. ఇలాంటి వారి బోధలు ఎదుర్కొన్నాము కాబట్టి ఇలా వ్రాసి మీ యెదుట పెడుతున్నాము. 


మరల నేడు మనం ఆలోచించిబోయే ముందుగా ప్రభువైన యేసు భూనివాస కాలములో ధర్మశాస్త్రము ప్రకారముగా కాక నేడు కూడా అనగా క్రీస్తు కాలములో/క్రొత్త నిబంధన ప్రకారంగా "మనతో(సంఘముతో/సంఘము మధ్య) కలసి తండ్రిని ఆరాధించుటకు యేసు వస్తారా?" అనే విషయాన్ని  గూర్చి ఆలోచన చేయుటకు ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


అవును.., క్రొత్త నిబంధన ప్రకారం మనతో(సంఘముతో) కలసి తండ్రియైన దేవున్ని ఆరాధించుటకు యేసు వస్తారనేది బైబిల్ స్పష్టముగా బోధిస్తుంది. కోపగించుకోకు సుమీ!! నీవు అనుకున్నట్టు యేసును నేనేమి తక్కువ చేయుట లేదు. నీవు ఊహించుకొనే విధముగా కూడా ఎక్కువేమీ చేయుట లేదు. ఆదిమ అపోస్తలలు బోధ ఆధారముగానే మాటలాడుచున్నాము అదే మనకు ప్రామాణికం కాబడాలి ఈ విషయమై మేము యేసుకు దేవత్వం లేదనే దుర్బోధకు చెందిన వ్యక్తులము కాము అనే విషయాన్ని గుర్తించుము.


మన ప్రభువైన యేసు తన భూసంబంధమైన పరిచర్యను అంటే మానవాళి కోసం చేసిన త్యాగాన్ని లేదా దేవుని సంకల్పమును లేదా తనకు తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేసి ఆయన్ను మహిమ పరిచినట్టుగా చూడగలం(యోహాను. 17:4). మానవ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను కదా (హెబ్రీయులకు. 1:3). అటు తరువాత దేవుడే సమస్తమును క్రీస్తు పాదములక్రింద ఉంచి, ఆయనను సంఘమునకు శిరస్సుగా దేవుడే నియమించెను కదా. సంఘము అనగా క్రీస్తు శరీరమే(సంఘము)గానే గుర్తించబడిందని తెలుసుకో... "ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.౹ మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.౹ ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది." (ఎఫేసి. 1:20-23). ఇంత గొప్ప స్థాయిలో దేవుని చేత హెచ్చింబడిన క్రీస్తు కూడా తన(క్రీస్తు) శరీరమైన అనగా క్రీస్తు సంఘంతో ఏకమై దేవుని ఆరాధించుటలో పాల్గొంటాడంటే మీరు ఆశ్చర్యపడనక్కరలేదు సుమీ!!


"నా" సంఘమును కట్టుదునునని చెప్పినప్పుడు నా అనే పదం క్రీస్తూనే సూచిస్తుంది కదా(మత్తయి. 16:18). ఆ సంఘము ఆయన శరీరమే(ఎఫేసి. 1:23) క్రీస్తు విభజింపబడలేదుగా? (1 కోరింది. 1:13) శరీరము యొక్కటే(ఎఫేసి. 4:4). విశ్వాసులు క్రీస్తు శరీరములో అవయవములు (1 కోరింది. 12:12-19) సంఘమునకు(శరీరమునకు) శిరస్సు క్రీస్తే కదా(కొలస్సి 1:18). క్రీస్తు సంఘము(రోమా. 16:16). ప్రభువు శరీరమందు లేక సంఘమందు ఆయనతో కలిసికొన్నవారు ఏకాత్మయై యున్నారు (1కొరింథీ. 6:17; 12:13). ఐతే సంఘము యధార్థముగా తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే విషయములో వారితో(సంఘముతో) కలసి యేసు 3 పనులు చేయుటకు వస్తారంట!! 


👥 మొదటి పని :

పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే(లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య (లేక, సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును అనెను. (హెబ్రీయులకు 2:11-12)


🍂 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును అనగా సంఘమునకు దేవుని వాక్యం/ అపోస్తలుల బోధను ఉపదేశించుటలో గొప్ప పని కలిగియున్నారు.

🍂 సమాజము మధ్య (లేక, సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును. సంఘము మధ్య నీ(తండ్రి) కీర్తిని అనగా దేవుని యొక్క గొప్పతనం, మహిమ మరియు ఔన్నత్యాన్ని సంఘము మధ్య చాటడమే. ఎలాంటే స్తుతులు, పాటలు లేదా స్తుతియాగం ద్వారా ఆయన గొప్ప పని కలిగియున్నారు.



👥 రెండవ పని :

"ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.౹ ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు." (హెబ్రీ. 7:24-25)


🍂 యేసు యొక్క యాజకత్వము యొక్క ప్రత్యేకతను మరియు ఆయన ద్వారా లభించే రక్షణ యొక్క సంపూర్ణతను గూర్చి ఈ వచనం మాట్లాడుతుంది. ఈ యాజకత్వం శాశ్వతమైనది, ఎందుకంటే ఆయన మరణించలేదు మరియు ఎప్పటికీ జీవిస్తున్నాడు. ఇతర యాజకులు మరణించిన తర్వాత వారి స్థానంలో వేరేవారు వచ్చేవారు, కానీ యేసు యొక్క యాజకత్వం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మన ప్రధాన యాజకుడు దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షాన నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఆయన వారి తరపున దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, వారిని కాపాడుతూ, వారిని ఆశీర్వదించమని వేడుకుంటాడు. 


🍃క్రైస్తవులు దేవునికి మరియు క్రీస్తుకు యాజకులని బైబిల్ సెలవు ఇస్తుంది.(ప్రకటన. 20:6) క్రీస్తే తన స్వరక్తమిచ్చి మనలను దేవునికొరకు కొని యాజకులుగాను చేశారు(ప్రకటన. 1:6; 5:10) యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండాలని(1 పేతురు. 2:5) రాజులైన యాజకసమూహముగా (1 పేతురు. 2:9)


🍂మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. "ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము." (హెబ్రీయులకు. 4:14) "దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు" (హెబ్రీయులకు. 10:21) "పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(హెబ్రీయులకు 7:26). "యేసు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.౹" (హెబ్రీయులకు. 7:24)  "మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేప్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణములేకుండ యాజకులగుదురు గాని యీయన –నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపపడడు అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. (హెబ్రీయులకు 7:20) 


🍃 పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు ఆరాధనకు అర్హుడు కాదు. అతన్ని మనం ఆరాధించకూడదు. ప్రధాన యాజకుడుతో కలసి యాజకులు యెహోవా దేవున్ని ఆరాధించేవారు. అటు దేవునికి మరియు ప్రజలకు మధ్య మధ్యవర్తిగా పనిచేశాడు, దైవ పరమైన విషయాలలో వారి ప్రతినిధిగా వ్యవహరించాడు. ప్రధాన యాజకుడి ద్వారా, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సంప్రదించి, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మరియు దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి బలులు మరియు కానుకలు అర్పించేవారు. (నిర్గమ. 25 నుండి 40 అధ్యాయములు).


అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా,౹ మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.౹ ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,౹ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును.౹ … పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేప్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను.౹ అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింప లేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.౹ అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.౹ అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను. (హెబ్రీయులకు 9:11-14,23-26)


🍃మనం మన ప్రధాన యాజకుడును ఆరాధన చెయ్యకూడదు. యేసు తనను ఆరాధించమని ఎప్పుడూ ఎన్నడూ మనలను కోరలేదు. మన ప్రధాన యాజకుడు మనతో(రాజైన యాజక సమూహము/ సంఘము) కలిసే తండ్రియైన దేవునికి ఆరాధన చేయు పని కలిగియున్నారనే సంగతి గుర్తించుకోవాలి. 



👥 మూడోవ పని :

"మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? —మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?౹ మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.౹ శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?౹ ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?౹ లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.౹ మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.౹ ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?"(1 కోరింది. 10:16-22)


 బల్ల ≈ ప్రభువుది 

 రొట్టె ≈ ప్రభువుది 

 పాత్ర ≈ ప్రభువుది 

 రాజ్యము(రాజ్య పౌరులు/క్రీస్తు సంఘము) ≈ ప్రభువునకు చెందిన వారు


🍃మన తండ్రియైన దేవున్ని యథార్థముగా ఆరాధన చేయి క్రమంలో మన ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఆయన బల్ల యెదుట నిలువుట సాధ్యమేనా? మన ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఆయన రొట్టె విరుచుట మరియు ఆయన పాత్రలోనిది త్రాగుట రాజ్యపౌరులకు సాధ్యమేనా? ప్రభువు భోజన బల్ల యొద్ద మనతో సహవాసం కొరకు, మనం ఆయనతో  పాలివారమౌగుటకై తండ్రిని ఆరాధించుటకు వస్తాడు. ఇలా క్రీస్తుకు మనకు గల రక్తసంబంధం. (అపో.కార్య. 20:28; ప్రకటన 5:9) క్రీస్తు బలి, విశ్వాసులకు దేవునితో ఐక్యతను కలిగించే ఒక మార్గం. విశ్వాసులు క్రీస్తులో పాలివారై, ఆయనతో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంటారు.  ఇట్టి కార్యక్రమాన్ని క్రీస్తు శరీరములో సాటియైన అవయవాలమై ఉండుటకు చేస్తున్నాం కదా. రాజ్య సంబంధమైన భోజనం చేయువారు ప్రభువునకు అతిథులు. యేసు తనవారితో సహవాసం చేసి దేవున్ని ఆరాధించుటకు గొప్ప పని కలిగి ఉన్నారు.


🔎 సారాంశము :

ఓ చదువరి... మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారియైయున్న దినములలో(ధర్మశాస్త్రం కాలం) మాత్రమే కాదు నేడు కూడా అనగా క్రీస్తు కాలంలో కూడా తన తండ్రిని ఆరాధన చేయుటకు సంఘము మధ్యకు వస్తారనేది బైబిల్ యొక్క సందేశమని గుర్తించుము. తండ్రి కీర్తిని గానం చేయుటకు, అపోస్తలుల బోధను ఉపదేశించుటకు, ఒక ప్రధాన యాజకుడుగా తండ్రిని ఆరాధిస్తూ, యధార్థముగా ఆరాధించుటకు వచ్చిన వారియెడల విజ్ఞాపన చేయుటకు, భోజన బల్ల యొద్ద మనతో సహవాసం కొరకు వస్తారని తెలుసుకొనగలరు. 


👤 తండ్రిని ఆరాధించాలనేది. తండ్రి యొక్క కోరిక - (యోహాను. 4:23-24)

👤 యేసును సేవించాలనేది. యేసు యొక్క కోరిక. (యోహాను. 12:26)


🔎మనతో కలిసి తండ్రిని ఆరాధించడానికి యేసు వస్తాడనే సత్యాన్ని నీకు నమ్మే మనస్సు ఉంటే అంగీకరించుము. 🙏🏿


♨️ హెచ్చరిక :

ఇంత చెప్పిన మరల క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసే అనే అపోహ ఇంకా ఉంటే.... క్రీస్తు శరీరం అనగా క్రీస్తు సంఘం తనను తాను ఆరాధించుకోదు తనకి(క్రీస్తు) శిరస్సు అయిన దేవుని(తండ్రి) మాత్రమే ఆరాధిస్తుంది (ఎఫేసి. 1:23; కొలస్సి 1:18; 1 కోరింది. 11:3; 12:13; హెబ్రీ. 2:11; రోమా. 16:16; యోహాను. 4:21-24).

మీ ఆత్మీయులు 👸👫👸

1. యేసు ఆరాధింపబడ్డారా? లేక ఆరాధన చేశారా? Click Here

2. ప్రభురాత్రి భోజనము Click Here

3ఆరాధన కోరిన దేవుడు? Click Here

ఆరాధన కోరిన దేవుడు? (A God who seek worship)

ఆరాధన కోరిన దేవుడు



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


📖 వాక్యము :

(యోహాను. 4:20-24): "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹"


🔎 వివరణ :

ప్రభువైన యేసు తన బాప్తిస్మము అనంతరం దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించు తరుణములో అనేకమంది ఆయన్ను వెంబడిస్తున్నారని, తన పరిచర్య వ్యాప్తి చెందుతుందని పరిసయ్యులు గమనించారని గుర్తించిన యేసు పరిసయ్యులతో ఢీకొనడానికి ఇది సరైన సమయం కాదని యెరిగి యూదయ దేశము విడిచి గలలియ దేశమునకు తిరుగు ప్రయాణములో యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.౹ అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.౹ సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు– నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.౹" 


అటు తరువాత యేసు ఆమెతో చేసిన సంభాషణ భాగముగానే "ఆరాధన కోరిన దేవుడు" అను ఈ అంశమును వ్రాసి మీ యెదుట పెడుతున్నాం కావున శోత్రులు చివరి వరకు చదివి, పరిశీలించి, ఆలోచన చేసి సత్యాన్ని స్వీకరించవలసిందిగా మనవి. ఇందులో ఏదియు అసందర్భంగా, పిట్ట కథలతో, కట్టుకథలతో, ఊహించుకొని చెప్పబడిన మాటలు కాదని స్వయముగా ప్రభువైన యేసే పలికిన మాటలని చదువుతునప్పుడు జ్ఞాపకం ఉంచుకో...


మన యెదుట ఉంచబడిన ప్రశ్నలు...

A. సమరయులు ఎవరు?

B. ఆరాధన కోరినది ఎవరు? 

C. ఎవరు ఆరాధించాలి?

D. ఎలా ఆరాధించాలి?

E. క్రైస్తవుల ఆరాధన స్థలమేది?

వీటితో పాటుగా మరి కొన్ని ప్రశ్నలకు సమాధానమును పరిశుద్ధ గ్రంథము నందు వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం.



A.  సమరయులు ఎవరు?

క్రీస్తుపూర్వం పదవ శతాబ్దంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను - సొలొమోను రాజు 40సం. పరిపాలించి చనిపోయిన తరువాత(1 రాజులు 11:42-43), అతని కుమారుడు రెహబాము యొక్క తెలివితక్కువ చర్యలు చీలికకు దారితీశాయి,(1 రాజులు 12:25- 33) దీని ఫలితంగా రాజ్యం ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు మరియు దక్షిణ రాజ్యమైన యూదాగా విభజించబడింది. (1 రాజులు. 11:31-39) ఉత్తర భాగం, "ఇశ్రాయేల్", షెకెమ్ మరియు సమారియా నగరాలను కలిగి ఉంది, దీనికి యరొబాము రాజు అయ్యాడు. దక్షిణ భాగం, "యూదా", జెరూసలేం మరియు యూదుల దేవాలయంను కలిగి ఉంది, దీనికి రెహబాము రాజు అయ్యాడు. (1రాజులు 12:1-33) ప్రతి దానికి స్వంత రాజు ఉన్నాడు. 721 BC లో, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం అష్షూరీయుల చేతిలో పతనమైంది. ఇశ్రాయేలు ప్రజలలో చాలామందిని బందీలుగా అష్షూరీయులకు తీసుకెళ్లారు.(2 రాజులు 18:9-10) ఈ సమరయులు కూడా ఇశ్రాయేలీయులే(ఉత్తర భాగం). షోమ్రోను అను హీబ్రూ పదానికి అర్థమే సమరయ పట్టణము. ఇవి రెండు వేరు వేరు పట్టణాలు కాదు. ఇశ్రాయేలు రాజు ఒమ్రీ ఈ పట్టణాన్ని కొని, దానికి షోమ్రోను అని పేరు పెట్టాడు. (1 రాజులు 16:24) ఈ పట్టణం యొక్క హీబ్రూ పేరు "షోమ్రోను" (שֹׁמְרוֹן). 


ధర్మశాస్త్రం కాలము మందు లేనివారిలో కొందరు యూదులు ఆ దేశంలోనే ఉండి,  అష్షూరీయుల అక్కడ నాటిన విదేశీయులతో వివాహం చేసుకున్నారు. ఈ సగం యూదులు, సగం అన్యులు కలిగిన ప్రజలే సమరయులు అని పిలువబడ్డారు. సమరయ ప్రజల గురించి మరియు వారి ఆరాధనా పద్ధతుల గురించి మరింతగా తెలుసుకోవడానికి 2 రాజులు. 17:14-41 వరకు చదవగలరు. 


సమరయులు అన్య జనాంగమని భావించి వారు యూదులతో సమానమైన వారు కాదనీ మొదలయిన కారణాలు చెప్పి యూదులు సమరయులను దూరం పెట్టారు. సమరయులకి మరియు మిగతా యూదులకి మధ్య సిద్ధాంత పరముగా కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. ఇందుకు సమరయులు ఏమి చేశారంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో అప్పటికి అందుబాటులో ఉన్న హీబ్రూ లేఖనాలను తీసుకుని వాళ్లకి అనుకూలంగా కొన్ని మార్పులు చేసుకున్నారు. 


🌿 ఉదాహరణకు : యూదులు యెరూషలేము దేవాలయములో యెహోవా దేవున్ని ఆరాధిస్తే... సమరయులు ఏమో గెరిజిమ్ అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ యెహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు.. ఇప్పటికీ ఇది ఒక పవిత్ర స్థలముగా భావించే వారు లేకపోలేదు. మోషే గారు వ్రాసిన పంచకాండాలు(5 పుస్తకాలు) మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఇందులో నిర్గమ.కాం. 20:17 వచనము తమకు అనుగుణముగా మార్చుకొని గెరిజిమ్ పర్వతం మీద యెహోవా దేవున్ని(తండ్రిని) ఆరాధించేవారు.


దేవుని చిత్తమైతే వీరి కోసం మరింత వివరముగా సమరయులుత్వరలో అనే అంశము ద్వారా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఇక విషయానికి వస్తే... యూదులను వీరు ఎంతో ప్రేమించేవారు కానీ యూదులే వారి మత పరమైన సిద్ధాంతాలను ధర్మశాస్త్రమునకు ఆపాదించి వీరితో సహవాసం చేయుటకు ఇష్టపడేవారు కాదు. ఇటువంటి ఒక సమరయరాలు తోనే యోహాను 4వ అధ్యాయం యందు యేసు సంభాషణ చేయటం మనం చూడగలం.



B.  ఆరాధన కోరినది ఎవరు?

యోహాను సువార్త 4వ అధ్యాయంలో వాళ్లిద్దరి మాటల మధ్యలో ఆ సమరయ స్త్రీ ఇలా అంటుంది... "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని.." ఆమె యేసు క్రీస్తుని ప్రశ్నిస్తుంది (యోహాను సువార్త 4:20). గెరిజిమ్ అనే పర్వతాన్ని ఉద్దేశించే ఆ సమరయ స్త్రీ యేసు క్రీస్తుతో అలా మాట్లాడింది.


    సమరయలు ఆరాధన స్థలము - గెరిజిమ్ పర్వతం 

 యూదులు ఆరాధన స్థలము - యెరూషలేములోనున్న దేవుని మందిరం/దేవాలయం.

☑  అటు పితరులైన, ఇటు యూదులైన ఎవరిని మాత్రమే ఆరాధించేవారు? ≈ యెహోవా దేవున్ని(తండ్రిని). 


పితరుల ఆరాధ్యదైవం :

అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 12:6-7)


అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. (ఆదికాండము 33:18-20)


యూదుల ఆరాధ్యదైవం :

🔖 యెహోవాను ఆరాధించు స్థలయొకటి... (2సమూయేలు. 15:32)

🔖 యెహోవాను ఆరాధించి స్తుతించిరి. - (2దినవృత్తా. 7:3)

🔖యెహోవాకు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి - (2దినవృత్తాంతములు. 29:25-30)

🔖 యెహోవా మందిరములో ఆరాధించుటకై - (యిర్మియా. 26:2)

🔖 యెహోవాకు ఆరాధన చేయవలెను - (యెహేజ్కేలు. 46:3)


[ Note : యూదులకు బాగా తెలుసు తమ ఆరాధ్యదైవం ఎవరో, ఎవరు ఆరాధన చేయమని తమను కోరారో అనే సంగతి.. ]


క్రైస్తవుల ఆరాధ్యదైవం :

(యోహాను. 4:22-23): "మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹"


మీరు అనగా సమరయులు మీకు తెలియనిదానిని ఆరాధించువారు.

☑ మేము అనగా యూదులు మాకు తెలిసినదానిని ఆరాధించువారము. 


👤"మేము" అనే మాటలో ప్రభువైన యేసు కూడా ఆరాధికుడైయున్నట్టు సూచించారే గాని తాను ఆరాధన కోరినట్టుగా చెప్పబడ్డలేదని విషయాన్ని గుర్తించుము. 


పాత నిబంధన అమల్లోనున్న కాలములోనే ప్రభువైన యేసు జన్మించారు. యేసు ఒక యూదుడు(లూకా. 2:27-28) ఆయన జన్మించిన నాటి నుండి మరణించిన వరకు కూడా ఏటేటా లేదా పండుగ దినాల్లో తన తండ్రిని ఆరాధించే ఆరాధికుడు అనే విషయం గుర్తించుము.(లూకా. 2:41-42; 22:1; యోహాను. 2:13; 4:45; 6:4; 7:2; 7:8-14; 10:22; 11:55-56; 12:1-20; మార్కు. 14:1; మత్తయి. 26:17-20). ఇందుకే తన యందు విశ్వాసులైన వారికి, ఆయన శిష్యులకు, తన్ను ఆరాధించమని ఆదేశించినట్టుగా మనకు గ్రంథమందు కన్పించదు. మరి "యేసు ఏమి కోరారు?"క్లిక్ చేయు అనే విషయాన్ని తెలుసుకొనుటకు క్లిక్ చేసి చదువుము. 


యేసే స్వయముగా తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది, తండ్రి కోరుచున్నాడు(23వ) అని చెప్పినప్పుడు క్రైస్తవుల నుండి ఆరాధన కోరిన దేవుడు యెహోవాయే(తండ్రే) అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఆలోచించుకోండి. యేసు ఎన్నడూ కూడా నన్ను ఆరాధించండి లేదా నన్ను ఆరాధించు కాలము వచ్చును అని అనలేదు. ఇంత చెప్పిన "యెహోవా దేవుడే యేసు"క్లిక్ చేయు అనే ఆలోచన ఉంటే నీ కోసమే ముందుగా వ్రాసాను క్లిక్ చేసి చదువుము. 



C.  ఎవరు ఆరాధించాలి?

ఆరాధన కోరినవాడు తండ్రియైన దేవుడే. ఆయనే యథార్థముగా ఆరాధించే ఆరాధికులు కావాలని కోరుకున్నాడు/వెతుకుచున్నాడు అని యేసే స్వయముగా చెప్పెను కదా(యోహాను. 4:23 చూడుము).


యధార్థవంతులైన ఆరాధికులు అంటే దిద్దుబాటును ప్రేమించేవారు అని అర్థం. పరమదేవుడును ఆరాధించేవారు తన మార్గముల విషయమై  బోధించునప్పుడు, హెచ్చరించినప్పుడు మనలోనున్న లోపాలను, దోషాలను గుర్తించి తిరిగి మరల ఆరాధన దినం లోపు  దిద్దుకొనేవారు కానీ తమ లోపాలను సమర్ధించుకునేవారు కాదు.  లోపాలను సమర్ధించుకునేవారు ఎప్పటికి  యధార్థవంతులుకారు". (c.f. కీర్తనలు. 50:17-22; యెషయా. 2:2-6; రోమా. 2:15; 1తిమోతి 4:3; తీతుకు. 1:15). 


ముందుగా దైవ ఇష్టాన్ని గుర్తించి దైవ సన్నిధికి వచ్చి తండ్రిని ఆరాధించాలి తప్పా తమ ఇష్టాలను, ఆలోచనలను తమ ఆరాధనలో కలిపి జరిగిస్తే దేవుడు ఎన్నటికి అంగీకరించరు. చాలా మంది తమ ఆరాధనను తమ ఇష్టాలతో, అభిప్రాయాలతో, వ్యాపార లావాదేవీలు కోసం, వ్యక్తిగత దూషణలతో, పగలతో, కక్ష్యలతో, ధనాపేక్షతో జరిగించేవారు లేకపోలేదు. మీలో అట్టి వారిని గుర్తించి సత్యాన్ని తెలియజేయండి. వారు వినని యెడల, మిమ్మలి తృణీకరించే ఆలోచన కలిగి ఉంటే అట్టి వారికి మీరు దూరంగా ఉండాలనే కోరుతున్న(రోమా. 16:17-18cf) కారణం ఇట్టి వారిని తండ్రి కోరడం లేదు. ఎందుకంటే యదార్థవంతులైతే అలా ప్రవర్తించరు కదా!! అటువంటి వారికి దూరముగా ఉండుటలో మేము ప్రథములమని చెప్పుటకు సంతోషించుటలో వెనుకడుగు వేయుటలేదు. కావున దేవునికి కావలసింది యధార్థమైన ఆరాధనే/ యధార్థమైన ఆరాధికులే కానీ ఏదో రకమైన ఆరాధన/ ఎవరైతే ఏంటి అనేది కాదు సుమీ!! 



D. ఎలా ఆరాధించాలి?

దేవుని ఆరాధికులు యధార్థవంతులైనప్పటికి ఎలా ఆరాధించాలి? అనే విషయాన్ని దేవుడు వారికి అవకాశమియ్యక తానే స్వయముగా ఆ నియమాన్ని ప్రభువైన యేసు ద్వారా పలికించుట మనం చూడగలం. "అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము...;౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹" (యోహాను. 4:23-24)


📖ఆత్మతోను ఆరాధించుట అనగా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించువారు అని అర్థం.(ఫిలిప్పీ. 3:2-3). వీరు తమ శరీరమును ఆస్పదము చేసుకొనని వారు అనగా వారు  రాజకీయవేత్తలైన, గొప్ప అధికారము గలవారైన, ప్రభుత్వ ఉద్యోగులైన, ఆఖరికి సీఎం, పీఎం అయిన...Etc. శరీర ఆదిక్యతను దైవ సన్నిధికి వచ్చే ముందు విడిచి పెట్టి దేవుని యొక్క ఆత్మతోనే ఆరాధించువారని అర్థం.


📖సత్యముతోను ఆరాధించుట అనగా ఆదిమ అపోస్తులుల బోధన క్రమం చొప్పున(అపో.కార్య. 2:42; 2 దెస్స. 2:15) లేదా సత్య వాక్యాన్ని సరిగ్గా విభజించేవారిగా(యోహాను 17:17; 2తిమోతి. 2:15) అని అర్థం. సత్య లేఖనము ప్రకారముగా కాకుండా ఎంత గొప్పగా చేసిన, చెప్పుకొనిన అది సత్యముతోను ఆరాధించినట్టు కాదు మరియు దేవుడు అంగీకరించే ఆరాధన కాదని గుర్తుంచుకో..


మరింత వివరణ కోసం "ఆత్మతోను, సత్యముతోను"క్లిక్ చేయు అనే అంశం క్లిక్ చేసి చదువుము. 



E. క్రైస్తవుల ఆరాధన స్థలమేది?

ఇక చివరిగా "క్రైస్తవుల ఆరాధన స్థలమేది" అనే విషయానికి వస్తే... యోహాను. 4:21లో ప్రభువు ఇలా ముందుగా సూచించెను కదా. "–అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹" ఇక్కడ మనకు చెప్పబడిన కాలము క్రొత్త నిబంధన కాలమే. పితరుల కాలములో పర్వతముల మీద, మోషే కాలములో యెరూషలేము మందిరంలో ఆరాధించేవారు. నేడు(క్రీస్తు కాలములో) ఒక ప్రత్యేకమైన స్థలమునకు ప్రాధాన్యత లేదని గుర్తించుము. 


యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించి, రక్షింపబడువారిని (రోమా. 10:9) క్రీస్తే తన శరీరమను సంఘములో చేర్చుచుండెను కదా(అపో.కార్య. 2:47) ఇలా చేర్చబడిన జనమే క్రీస్తు సంఘము(1 కోరింది. 3:16-17; రోమా 16:16) వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక నుండువారు (అపో.కార్య. 2:42) వీరు క్రీస్తు సంఘమను శరీరములో సభ్యులు అనగా అవయవములు(ఎఫేసి 1:23; రోమా. 12:4; 1 కోరింది. 12:12-14). వీరికి శిరస్సు క్రీస్తే(కొలస్సి 1:18) వీరికి ప్రభువు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు(1 కోరింది. 8:6b) వీరికి దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి(1 కోరింది. 8:6a) వీరు ఒక్క శరీరంగా ఉండుటకు లోకము నుండి పిలువబడిన వారు(1 కోరింది. 1:1; ఎపేసి. 4:4) ఇటువంటి వారి మధ్య అనగా క్రీస్తు ప్రభువై/రాజై (అపో.కార్య. 2:36; 10:36) ఏలుబడి చేయువారు మధ్య జరిగే ఆరాధనే దేవుడు అంగీకరించే ఆరాధన. సంఘానికి శిరసైన క్రీస్తు ఏం చెప్పినా అన్నివిషయాలలో ఆయన మాట వినేవారి సముదాయం గలవారు ఉన్న స్థలమునే దేవుడు నివసిస్తాడు. అది ఆయన కోరిన స్థానము. అక్కడే ఆరాధన జరగాలి. ఇంకే చోట జరిగిన అది ఆరాధన అనబడదు. మరి "అది ఏ ఆరాధన అనబడును?"క్లిక్ చేయు అనే విషయం కోసం క్లిక్ చేసి చదువుము. 



📝 సారాంశము 

ఓ చదువరి... ఆరాధన కోరిన దేవుడు తండ్రియే(యెహోవా) అని యేసే స్వయముగా సమరయ స్త్రీతో జరిగిన సంభాషణలో మనం గుర్తించాం కదా. ఎవరిని ఆరాధించాలో, ఎవరు ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో అనే విషయాలను యోహాను 4:21-24 వరకు స్పష్టముగా చదివి తెలిసినప్పటికి యేసును ఆరాధించకూడదా? యేసు ఆరాధింపబడ్డారు కదా? అంటూ నీ మదిలో మెదిలితే మరొక్క అంశం రూపములో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు ఆరాధన కోరిన దేవుడు తండ్రే అని యేసు ఇచ్చే వివరణ బట్టి గట్టిగా విశ్వసించుము అలాగునే చేయుము.


(అపో.కార్య. 3:22-23) "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹"

మీ ఆత్మీయులు 👪

1. యేసును ఆరాధించాలా లేక సేవించాలా? Click Here

2. యెహోవా దేవుడే యేసు? Click Here

"యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడా!?" Is Jehovah came as like Jesus



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. 🙏🏿

పరలోకమందున్న దేవుడు ఆది నుండి జరుగు సంగతులను మరియు తన సంకల్పమును అంతటిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మనుషులు చేత వ్రాయించి(66 పుస్తకాలుగా వ్రాసి) మానవజాతికి ఇచ్చుటకు గల ముఖ్య ఉద్దేశ్యం నరుడు తాను బ్రతుకు దినములన్నియు పరిశుద్ధ గ్రంథమును చదువుటకును(ద్వితీయో. 17:21; 1 తిమోతి. 4:13; ప్రకటన), దానిలో విషయాలు చదివి/విని బాగుగా గ్రహించుకొనుటకును (నెహె. 8:8 అపో.కార్య. 8:30), పరిశోధన చేయుటకును (యెషయా. 34:16; అపో.కార్య. 17:11), ధ్యానించుటకను(యెహో. 1:8; కీర్తనలు. 1:2) తన బాల్యదినములందే సృష్టికర్తను యెరుగుటకును(ప్రసంగి. 12:2) దేవుని గూర్చిన జ్ఞానమును(2 కోరింది.10:5; 1 దేస్స.2:13), క్రీస్తును గూర్చిన జ్ఞానమును(ఎఫెసి.4:11), అలాగే పరిశుద్ధాత్ముడు గూర్చిన జ్ఞానమును(యోహాను.14:16; తీతుకు.3:5-6) స్పష్టముగా యెరిగి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్(క్రీస్తు సంఘముగా) చేర్చబడుటకును, అపోస్తలుల బోధలో తమ జీవితాలను దిద్దుబాటు చేసుకొనుటకును, క్రీస్తు స్వరూపం తనయందేర్పడుటకును, క్రీస్తు ప్రత్యక్షతలో మనం తండ్రి యొద్దకు చేరుకోవాలనే కదా!!(అపో.కార్య.2:38-42; గలతీ. 4:19; యోహాను. 14:6).

నిజమైన విశ్వాసికి బైబిలే ప్రామాణికం కాబడాలి లేనియెడల తమ ఊహలు/ఇష్టాలు గ్రంథానికి ఆపాదించబడే అవకాశాలున్నాయి. ఇలా మనుషులు సరిగ్గా ఆలోచించక, పరిశీలించక, చదవక, సరిగ్గా విభజించక పోవుట వలన పుట్టుక వచ్చే బోధలే త్రిత్వము, త్రియేక, ఏకతత్వవాదం, గతికవాదం, జ్ఞానతత్వవాదం ఇవి... 👇👇

త్రిత్వ వాదం అనగా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలోనున్న ఒక్క దేవుడు మరియు ఒక్క స్వభావమే. తండ్రి పూర్తిగా దేవుడు కుమారుడు పూర్తిగా దేవుడు పరిశుద్ధాత్మ కూడా పూర్తిగా దేవుడు అయిన మనకు ఒక్క దేవుడు ఆయనే యేసు అంటూనే తిరిగి యెహోవాయే యేసు, యేసే పరిశుద్ధాత్ముడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.

త్రియేక వాదం అనగా ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక్కడే. ఒక్క దేవుడు మూడు రూపాల్లో పాత్ర పోషించారని. ద్వి లేదా త్రీ పాత్రాభినయం చేశాడని.. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారని,  ఆ ముగ్గురిని కలిపితే సంపూర్ణ దేవుడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.

ఏకతత్వవాదం  అనగా ఇద్దరూ ఏకమైయున్నారు అంటే  ఒక్కడైయున్నారని,  ఒక్క దేవుడే ద్విపాత్రాభినయం చేశాడనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.

❌  గతికవాదం అనగా యేసును దేవుడు కలుగజేశాడని. యేసు రెండవ రాకడ అయిపోయిందని, నరకం లేదని, సంఘము శాశ్వతముగా భూమి మీద ఉంటుందని, పునరుత్థానం లేదని, పరలోకము లేదని,...Etc. (జ్ఞానతత్వవాదల నుండి పుట్టుకు వచ్చిన వారే ఈ గతికవాదులు).

జ్ఞానతత్వవాదం అనగా యేసు శరీరములో దేవత్వం లేదు, శరీరమునకు పునరుత్థానం లేదు, యేసు కేవలం నరుడు మాత్రమే, అనాదిలో తండ్రి ఆలోచనలో మాత్రమే ఉన్నాడు కానీ తండ్రి యొద్ద లేరు..Etc.

మనం ముఖ్యముగా త్రిత్వము మరియు త్రియేక వాదుల బోధలు విషయానికి వస్తే ఇవి పూర్తిగా బైబిల్ కి వ్యతిరేకం. యేసు ఎప్పుడూ "త్రిత్వం/త్రియేక(Trinity)" అనే పదాన్ని ఉపయోగించలేదు. మనకు ఆ పదం బైబిల్లో కనిపించదు. ఇవి మనుషులు తమ ఆలోచనలును  పరిశుద్ధ గ్రంథానికి ఆపాదించి మాట్లాడే విషయాలే. కావున ఇటువంటి అబద్ధాలు బారిన పడకూడదనే ఆలోచనతో "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడా!?" అనే అంశము మీ ముందు ఉంచుటకు ప్రయత్నం చేయుచున్నాము కావున చివరి వరకు చదివి ఆలోచించి, వాక్య పరిశీలన  చేయవలసిందిగా మనవి. 🙏


🔥 కీలకమైన విషయాలు :
 
👤 మన దేవుడైన యెహోవా ≈ అనాది (సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యెషయా. 40:28; కీర్తనలు. 90:1-2).

👤 మన ప్రభువైన యేసుక్రీస్తు ≈ అనాది(సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యోహాను. 17:5; 1 పేతురు. 1:18-20).


📖 పాత నిబంధన కాలములో దేవుడైన యెహోవా తన భక్తుల ద్వారా యేసుని గూర్చి ముందుగా తెలియపరచుట :


1). అబ్రహామునకు తెలియజేసిన మాటలు: (ఆది. 17:7; గలతీ. 3:16).
2). దావీదునకు తెలియజేసిన మాటలు: (2 సమూయేలు. 7:12-19).
3). యెషయాకు తెలియజేసిన మాటలు: (యెషయా. 7:14; 9:6-7).
4). యిర్మియాకు తెలియజేసిన మాటలు: (యిర్మియా. 31:31-33).
5). దానియేలుకు తెలియజేసిన మాటలు: (దానియేలు. 7:13-14).
6). మీకాకు తెలియజేసిన మాటలు: (మీకా. 5:2).
7). జెకర్యాకు తెలియజేసిన మాటలు: (జెకర్యా. 9:9).
8). మలాకీకు తెలియజేసిన మాటలు: (మలాకీ. 3:1).



🔥 "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వస్తే..."

మనం ఒక్క క్షణం "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు" అని భావిస్తే బైబిల్ ను  నీవు పూర్తిగా అపార్థం చేసుకొనట్టే అగును కదా... ఎలా అనేది  ఈ క్రింది విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేయుము. 

A). యేసుక్రీస్తు ఎవరిచేత పంపబడ్డాడు? ఆలోచించుకో... - (యోహాను 5:30; 8:42; 17:3; 20:21).

B).  యేసుక్రీస్తు ఎవరి యొద్ద నేర్చుకున్నాడు? ఆలోచించుకో... - (యెషయా. 50:4-7; యోహాను. 5:19; 8:28; 12:49-50; 14:24; 15:15). 

C).  యేసుక్రీస్తు ఎవరి మాట విన్నాడు? ఆలోచించుకో...  - (యోహాను 3:32; 12:49-50; 14:10). 

D). యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరికీ విధేయుడుగా ఉన్నాడు?  ఆలోచించుకో... - (యెషయా. 53:10-12; మత్తయి. 26:39; యోహాను. 10:18; 14:31; రోమా 5:19; ఫిలిప్పీ 2:8; హెబ్రీ 5:5-9).

E). యేసుక్రీస్తును సమాధి/మరణం నుండి ఆయనను లేపిందెవరు? ఆలోచించుకో...  - (అపో.కార్య. 2:24; 3:15; 4:10; 13:37; 17:31; 4:25; రోమా 6:4; 7:4; 8:11; 1 కొరింథీ 6:14; 15:4,12; ఎఫేసి 1:20,21).

F). యేసుక్రీస్తుకు ఎవరు అధికారం ఇచ్చారు?. ఆలోచించుకో... - (యోహాను. 5:26; మత్తయి 28:18,19; ప్రకటన 2;26; 3:12; 1పేతురు 3:22).

G). యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు?. ఆలోచించుకో... - (యెషయా 11:1-5; మత్తయి 12:18,28  లూకా. 4:18; యోహాను 3:34; అపో.కార్య. 10:38).

H). యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరికీ ప్రార్ధన చేశారు?. ఆలోచించుకో... -(కీర్తనలు 22:1-10; మత్తయి 11:25; 26:38-39; 27:46; మార్కు 1:35; లుకా 6:12; యోహాను 17:1-22; హెబ్రీ 5:7). Etc.

I). యెహోవా దేవుడే వస్తే... యేసుక్రీస్తు ఎవరిని నా దేవా నా దేవా, నా తండ్రి, నా దేవుడు అనెను? ఆలోచించుకో... (మత్తయి 27:46; యోహాను 20:17). Etc.

J). యెహోవా దేవుడే వస్తే... యేసుక్రీస్తు ఎవరి కుడి పార్శమున కూర్చున్నారు? - ఆలోచించుకో... (అపో.కార్య. 2:25,33,35; 7:55; రోమా. 8:34; ఎఫెసి. 1:20; కోలస్సీ 3:1; హెబ్రీ 1:3; 8:2; 10:12; 12:2; 1 పేతురు. 3:22).


👥 మరిన్ని ఆధారాలు  :

🍃 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను. -(యోహాను. 1:1-2)
☑ పై వచనమును బట్టి వాక్యము ఎవరు ? – యేసు (యోహాను. 1:14a).
☑ ఆ వాక్యము ఎవరియొద్ద ఉండెను ? – యెహోవా (యోహాను. 1:2; 14b).

🍂  నేను తండ్రియెద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను . –(యోహాను. 16:28).
☑ పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసి 1:19).
☑ తండ్రియొద్దకు వెళ్లుచున్నవారు  ఎవరు ? – యేసు (యోహాను. 17:5).

🍁ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవునికుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. (అపో.కార్య. 7:56).

☑ పై వచనమును బట్టి దేవుడు ఎవరు ? – యెహోవా (1 కోరింధి. 8:6).
☑ దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నది ఎవరు ? – యేసుక్రీస్తు (మార్కు. 16:19).

🍃  నేను తండ్రిని వేడుకొందును, మీయెద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించెను. (యోహాను. 14:16).

☑ పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసీ. 4:6).
☑ తండ్రిని వేడుకొందునని చెప్పినది ఎవరు ? – యేసు (యోహాను. 17:1-2).

🍂 తండ్రిని(Father)  కుమారుని(Son) ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. (1 యోహాను. 2:22).

☑ నా తండ్రి (మత్తయి. 10:32), మీ తండ్రి (మత్తయి. 23:9), మన తండ్రి (1 కోరింధి. 8:6).
☑ అద్వితీయ కుమారుడు. – (యోహాను. 3:16).


🔥 యెహోవా దేవుడు - యేసు కాదని అనుటకు సాక్ష్యము :

👤 యెహోవా సాక్ష్యము – (నిర్గమ. 33:20).
👤 యేసుక్రీస్తు సాక్ష్యము – (యోహాను. 1:18).
👤 పరిశుద్ధాత్ముని సాక్ష్యము – (1 తిమోతి. 6:16; 1 యోహాను. 4:12).

గమనిక : ఇద్దరి మనుష్యుల సాక్ష్యము సత్యమని గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. – (యోహాను. 8:17).


సారాంశము : ఓ చదువరి... నీకు ఇవ్వబడిన బైబిల్ జాగ్రత్తగా చదువుటకు, గ్రహించుకొనడానికి, పరిశీలన చేయడానికి, ధ్యానించడానికి, క్రీస్తు నందు రక్షింపబడి, క్రీస్తు పరిపాలన క్రింద చేర్చబడి, మరల ఆయన ప్రత్యక్షతలో తండ్రి యొద్దకు చేరుకొనుటకు, యుగయుగములు ఆయన సన్నిధిలో ఉండానికి ముందుగా ఇవ్వబడిన పరిశుద్ద గ్రంథమని గుర్తిస్తే... ఆయన గ్రంథములో లేనివాటిని తిరిగి గ్రంధానికి కలిపి, చెరిపి బోధించే అవకాశం ఇవ్వబడలేదనే విషయాన్ని మొదటగా గుర్తించు. ఇక విషయానికి వస్తే... "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు" అనుటకు బైబిల్ ఏమాత్రం అంగీకరించదు. ఇది పూర్తిగా దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన బోదె. కాబట్టి పై వ్రాసిన విషయాలను వాక్యాలతో సహా చదివి, పరిశీలన చేయమని, అసత్యానికి/అబద్ధ బోధకు దూరంగా ఉండాలని మిమ్మలి  క్రీస్తు నందు ప్రేమతో కోరుతున్నాం. 🙏 

"యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అనేది ఒక కట్టుకథ"

WhatsApp Join Us   Telegram Join Us

మీ ఆత్మీయులు 👪


🔎 మరెన్ని అంశాలు పరిశీలన చేయుటకు :

3. గతికవాదంత్వరలో
4. యేసుని ఎవరు పంపెను?క్లిక్ చేయు

యెహోవాకు దేవుడు క్రీస్తా?(Jehovah's god is Christ?)

 యెహోవాకు దేవుడు క్రీస్తా?



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు🙏 


నేటి క్రైస్తవ సమాజములో మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకొంటూ... "యెహోవా దేవునికే దేవుడు ఉన్నారని ఆయనే యేసు" అనుచు  హెబ్రీయులకు. 1:7-8 వచనములు చూపించి తమకి అనుగుణముగా పరిశుద్ధ గ్రంథమును వక్రీకరించి, వాక్యమును అపార్థం చేసుకొనేవారు లేకపోలేదు. ఇలాంటి వారిని నేను ఎదుర్కొని తెలియపరిచినప్పటికి వారు విననందున దేవునికి విడిచిపెట్టి వదిలివేశాను. మరల కనపడే సరికి... కాస్త ఆలోచించి ఇలాంటి మిత్రుల బారిన ఎవరు పడకూడదని భావించి "యెహోవాకు దేవుడు క్రీస్తా?" అనే అంశమును వ్రాయుటకు సిద్ధపడి మీ యెదుట పెడుతున్నా కావున సత్య సంబంధులు చివరి వరకు చదివి, ఆలోచించి, సత్యాన్ని గుర్తించగలరని మనవి. 
మిత్రుడు నాతో మాటలాడిన సంభాషణ

📖 వాక్యము :
హెబ్రీయులకు. 1:7-9: "—తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే – దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను."
Heb 1:7-9: "And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire. But unto the Son he saith, Thy throne, O God, is forever and ever: a scepter of righteousness is the scepter of thy kingdom. Thou hast loved righteousness, and hated iniquity; therefore God, even thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."

కీర్తనలు. 45:6-7: "దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు [నీ] దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు."
Ps 45:6-7: "Thy throne, O God, is forever and ever: the scepter of thy kingdom is a right scepter. Thou lovest righteousness, and hatest wickedness: therefore God, thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."


💥 వాక్య వక్రీకరణ :
దేవా(O God) అనే మాటను పట్టుకొని యెహోవాకు దేవుడు ఉన్నారని. యెహోవా దేవుడే స్వయముగా నా దేవుడు యేసు అని అన్నారనే బోధ.
యేసు నా దేవుడు(MY GOD) నా తండ్రి అని ఎలా అన్నారో. (యోహాను. 20:17) అలాగే యెహోవా దేవుడు కూడా నా దేవుడు యేసు అన్నారనే బోధ (హెబ్రీ. 1:8).


🔎 వివరణ :
పరిశుద్ధ గ్రంథముతో కాస్త పరిచయం ఉన్నవారు ఎవరైనా ఇది  అబద్ధమే అని ఇట్టే నిర్ణయించగలరు. కానీ మన మిత్రులు ఎందుకు ఆలోచన చేయలేక, వాక్య వక్రీకరణకు పోతున్నారో వారే పరీక్షించుకొని, నిర్ధారణ చేసుకోవాలి. ఏది ఏమైనా సత్యం తెలియజేయడం మన బాధ్యత. ఇక విషయానికి వస్తే...

1. మనము పాపమునుండి విమోచింపబడి, నీతివిషయమై జీవించునట్లు, యేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:18; 1 పేతురు. 2:24; యెషయా 53:4-5; 12). మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచి(1 కొరింది. 15:3-4), అనాది దేవుని సంకల్పం నెరవేర్చి(1పేతురు. 1:18:19-20; అపో.కార్య. 2:23). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). తన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).

2. తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన కుమారున్ని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి, ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3-4; 9).

🔖Note : పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తరువాత యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనెను. (హెబ్రీ మొదటి అధ్యాయం అనాదిలో జరిగిన సంఘటన కాదు). 

3. అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి, ఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు యెహోవా దేవుడే తన కుమారుడును మనకు "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32; యోహాను. 3:36; అపో.కార్య. 2:32-36; 10:36). ఈ సంగతి ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని పరిశుద్ధాత్ముడే చెప్పెను కదా!! (అపో.కార్య. 2:36).



📝 తండ్రి(యెహోవా) ఇలా కుమారుడును(యేసును) అభిషేకించె పనిలో ముందుగా... "దేవా"(O God) అని తన కుమారుని గూర్చి ఇలా సంభోదించెను.(8వ)

☑ గ్రీకు : ho theos(ὁ θεός) 
☑ ఇంగ్లీష్ : O God
☑ తెలుగు : దేవా

🍂 దేవా(O God) అనేది ఆశ్చర్యం, ఉత్సాహం, బాధ లేదా సహాయం కోసం విజ్ఞప్తికు వివిధ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, గొప్ప చేయుటకు ఉపయోగించే ఒక సాధారణ ఆశ్చర్యార్థక పదబంధమే కానీ తనకు దేవుడని లేదా నా దేవుడు అని అర్థం కాదు. 

🍂 దేవా అని కుమారుని పిలుచుటకు గల కారణం "యేసు తన దేవుని మహిమయొక్క ప్రతిబింబమును మరియు స్వభావ సిద్ధముగా తన దేవుని గుణ లక్షణములు గలవాడనే కదా". (హెబ్రీ. 1:3).

🍂దేవా(O God) అనగా దేవుడు లేదా దేవత్వము గలవాడ అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవత్వము" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము. 
🍂 "దేవా" అనే పదం ఎక్కువగా పా.ని లో కీర్తనలు గ్రంథము నందు 144 సారులు వాడారు. ఉదా: (కీర్తనలు. 4:1; 5:10; 16:1; 61:5...చూడుము).



📝 చివరిగా మిత్రులకు "నా దేవా"(My God) అనే విషయమై వివరణ ఇవ్వాలని ఉద్దేశించి.. యేసు స్వయంగా సిలువలోని, సమాధిలో నుండి లేచిన తరువాత పలికిన మాటలను చూస్తే...

🍃..."నా దేవా(my God), నా దేవా(my God) నన్నెందుకు చెయ్యి విడిచితివని..." మత్తయి. 27:46

🍃..."...నా దేవుడును(my God) మీ దేవుడునైన(your God) వాని యొద్దకు..." యోహాను 20:17

🍃 నా దేవా(My God) అనేది దైవంతో వ్యక్తిగత, భక్తిపూర్వక మరియు తన దేవుడు అని ఆధారపడే సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. యేసు తన దైవం మీద ఆధారపడి బ్రతికి మనకు మాదిరి ఉంచిపోయేను కదా! 

🍃 నా దేవా(my God) అనగా నా దేవుడు లేదా నా దైవం అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవుడు ఎవరు?" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము.


🔎 "దేవా" మరియు "నా దేవా" అనే రెండు పదాలు వేరు వేరు అర్థాలు ఇచ్చు పదాలు అనుటకు ఆధారాలు :

కీర్తనలు 43:4: "... దేవా(O God) నా దేవా(My God), సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను"
కీర్తనలు 68:24: "దేవా(O God), నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని(my God) గమనమును వారు చూచియున్నారు.
కీర్తనలు 63:1: దేవా(O God), నా దేవుడవు(my God) నీవే, వేకువనే నిన్ను వెదకు దును"

🌱 యెహోవా & యేసు ఇద్దరు ఏకమైయున్నారు అంటే ఒక్కటే అని అంటావు ఏమో! ఇందుకోసం "ఏకమైయున్నాము!? Click Here " కొరకు ఇక్కడ క్లిక్ చేయుము.


💢 సారాంశము :
పరలోకమందున్న దేవుడు తన రాజ్యము పైన అనగా క్రీస్తు సంఘము(church of Christ) మీద యేసును ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించి, పట్టాభిషేకం చేయుటకు ముందు యేసును "దేవా" అనగా దేవత్వం గలవాడా అనే సంభోదించారు తప్పా... "నా దేవా/నా దేవుడు" అని అనలేదని మిత్రులు ఈ సత్యాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాము.

"మన తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.౹"

WhatsApp Join Us   Telegram Join Us

మీ ఆత్మీయులు👪

ఏకమైయున్నాము!? (యోహాను. 10:30)

 

ఏకమైయున్నాము!? (యోహాను. 10:30)


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


నేటి క్రైస్తవ్యమనే సమాజములో అనేకమందికి యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనము అనేది అర్థంకాక, వారి బోధల చేత అపార్థం చేయబడి, వక్రీకరించబడి, అసత్యము సత్యముగా బోధించబడుతున్న తరుణములో  సత్యము ఏంటో పరిచయం చేయుటకు, అట్టివారి బోధలను సత్యవాక్య ఆధారముతో ఖండించుటకు, సరిచేయుటకు ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశమైయున్నది. శ్రోతులు కంగారు పడకుండా చివరివరకు అంశాన్ని చదివి, ఆలోచించి, వాక్య పరీక్ష చేసి, సత్యాన్ని స్వీకరించవలసిందిగా  మనవి.


 📖 వాక్యం : 

"నేనును తండ్రియును ఏకమై యున్నామని(యేసు) వారితో చెప్పెను.౹" (యోహాను. 10:30).


💢 వక్రీకరించబడే విధానం : 

క్రైస్తవులకు దేవుడు యేసు అని చూపుటకు ఎన్నుకొనే సరిక్రొత్త బోధన విధానమే ఈ త్రీయేక మరియు త్రిత్వము బోధలు. ఇట్టి బోధలు నుండి పుట్టుకు వచ్చిన బోధయే "తండ్రి మరియు యేసు ఒక్క వ్యక్తే అని, యెహోవాయే శరీరధారిగా యేసుగా వచ్చారని, ఇద్దరు కాదని, ఈయనే ఆయన.. ఆయనే ఈయన"... (యేసు మాటల్లో ఒక్క ఆధారం కనపడదు).


🔎వాక్య వివరణ :📖  

"నేనును తండ్రియును ఏకమై యున్నామని(యేసు) వారితో చెప్పెను.౹" (యోహాను 10:30): 


John 10:30: "I and my Father are one." [KJV]

John 10:30 I and the Father are one heart and mind [ MSG]


John 10:30: "ἐγὼ καὶ ὁ Πατὴρ ἕν ἐσμεν.”"


గ్రీక్ : εἷς - heis - hice ≈ G1520

 ఇంగ్లీష్ : One, One heart and mind

 తెలుగు :  ఏకమై యున్నామని


 🔍కీలకమైన విషయాలు 📖 


🍂 మన దేవుడైన యెహోవా ≈ అనాది (సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యెషయా. 40:28; కీర్తనలు. 90:1-2).

🍃 మన ప్రభువైన యేసుక్రీస్తు ≈ అనాది(సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యోహాను. 17:5; 1 పేతురు. 1:18-20).

🍂 ఇరువురు సృష్టి నిర్మాణములో ఉన్నారని. - (ఆది.కాం. 1:1; యెషయా. 45:18; కొలస్సి. 1:15-17; హెబ్రీ. 1:2,10).

🍃 నరుని నిర్మాణములో ఇరువురు ఉన్నారని - (ఆది.కాం. 1:27; మార్కు. 10:6; 1 కోరింది. 8:6b).

🍂 ఇరువురు ఆది(సృష్టి అనంతరం) నుండి ఉన్నారని. - (యోహాను. 1:2-3).


అనాది కాలము నుండి ఇరువురు ఉన్నారు అనేది బైబిల్ ఇచ్చు సమాచారం. ఐనప్పటికి "ఏకమైయన్నారు" అంటే ఇద్దరూ ఒక్కడే/ఒక్క వ్యక్తే అని ఎలా అనుకోగలం? ఇంతకు ఏకమైయున్నారు అంటే ఏంటి? యేసు మాటలు బట్టి ఇరువురు ఏ విషయములో ఏకమైయున్నారు? అనే విషయాలు ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.


📖 ఏకమైయున్నాము అంటే ఒక్కటైయున్నాము అని అర్థమే కానీ ఒక్కడైయున్నాము అని కాదు. "యున్నాము" అనే మాటలో బహువచనం కనపడలేదా? ఇంతకు "ఏకమై/ఒక్కటైయున్నాము" అంటే దేవత్వపు ఏకత్వమే కానీ వ్యక్తిత్వపు ఏకత్వము కానేకాదు. యేసు ప్రభువు యోహాను 10:30లో దేవత్వపు ఏకత్వమనే భావనతో చెప్పెను గాని వ్యక్తిత్వపు ఏకత్వము భావనతో కాదు. తొందరపడకు అది ఎలాగునో చూద్దాం. 


 👤 వ్యక్తిత్వపు ఏకత్వము :

వ్యక్తిత్వపు ఏకత్వము అంటే తండ్రీ, నేను(యేసు) ఒక్కరే/ఒక్కడే అని అర్థం. (లేదా) నేనే తండ్రిని, ఆ తండ్రే నేను అని అర్థమిచ్చును కదా. 


యేసుక్రీస్తు మనకు తండ్రి కాదు. మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.(1కోరింది. 8:6). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు(తండ్రి) మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.(రోమా 10:9). 


మనకు తండ్రి ఎవరు? యేసు మాటల్లో ఎవరు యేసునకు తండ్రో ఆయనే మనకు తండ్రి. "... నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు..." (యోహాను. 20:17) యేసు ఈ లోకములో "నా తండ్రి" అని పలికే సందర్భాలు అనేక కలవు. "మేము ఇద్దరమూ" అనే విషయాన్ని స్పష్టముగా చూడగలం. (యోహాను. 8:14-17cf వాక్యం చదువుము) కావున ఒక్కడై ఏకమైయుండలేదు. వారు ఇరువురు దేవత్వం  విషయములో ఒక్కటై ఇద్దరు వ్యక్తులైయున్నారు. 


💢ఉదాహరణకు : ఒక క్రైస్తవుడు, నాలో క్రీస్తు ప్రభువు ఉన్నారు అని ఎలాగైతే వ్యక్తపరుస్తాడో అలాగే క్రీస్తు ప్రభువు కూడా తనలో తండ్రి ఉన్నారని (ఎఫెసి. 3:15; గలతీ. 2:20) తన మాటల్లో చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. (యోహాను. 8:16). "యేసు-ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము." (యోహాను. 14:23). కాబట్టి వ్యక్తులుగా వారు ఒక్క వ్యక్తిగా లేరు. వారు ఇద్దరే కానీ తత్వము విషయంలో ఒక్కటైయున్నారు. యోహాను. 10:30వ వ్యక్తిత్వపు ఏకత్వము గూర్చి చెప్పుట లేదని గుర్తించుకో..


 👥 దేవత్వపు ఏకత్వము :

దేవత్వపు ఏకత్వము అంటే వారి తత్వము యొక్క ఏకత్వమని, వారి చిత్తము యొక్క ఏకత్వమని, వారి సంకల్పము యొక్క ఏకత్వమని, వారి విమోచన యొక్క ఏకత్వమని అర్థం. ఇదే విషయాన్ని యేసు(నేను) తండ్రియును ఏకమై యున్నామని చెప్పెను కదా.౹"


యోహాను. 10:30వ ఏకమైయున్నాము అనే భావన యేసు మరియు  దేవుడు ఒకే ఒక దేవత్వము విషయములో ఏకమౌతారని(ఒక్కటై ఉంటారని) వివరిస్తుంది కానీ వ్యక్తిత్వపు ఏకత్వము గూర్చి కానేకాదు. మరింత వివరణ కోసం దేవత్వము మరియు యేసు దేవత్వము అనే రెండు అంశములను పూర్తిగా చదవగలరు.


 💥 ఒక్క వ్యక్తే ≈ ఇద్దరు కాదు అనే భావన?


ఇంకను ఏకమైయన్నారు అంటే ఒక్క వ్యక్తే, ఇద్దరుగా లేరు/కాదు, ఒక్కడైయున్నారని కాదు అనే అపోహ నీవు కలిగి ఉంటే... ఇట్టివి బైబిల్ కు వ్యతిరేకమైన ఆలోచనలు, బోధలు కాబట్టి నీవు సరి చేసుకొనుటకు ఈ క్రింది విషయాలను ఆలోచన చేయుము. 


1. ఆదిలో దేవుడే ఆదాము మరియు హవ్వకి వివాహం చేసి వారిరువురును (స్త్రీ, పురుషులను) ఏకశరీరము చేయు విషయములో దేవుడు పలికిన మాట.

(ఆది.కాం. 2:24): "కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు."

(ఎపేసి. 5:31): "ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.౹"


ఇది దేవుడు జత చేసిన ఏకత్వము. ఏకత్వమునకు ఏ మనుషుడు అర్ధం చెప్పనక్కరలేదు. ఒక స్త్రీ శరీరమును, ఒక పురుషుని శరీరమును వివాహం అను బంధము ద్వారా వారిద్దరును ఏక శరీరముగా చేయునది దేవుడే. ఇక్కడ ఏకము అంటే ఇద్దరిని ఒక్కడైయున్నారు/ఒక్కడే అని అనగలమా? దేవుని చేత ఏక శరీరము కాబడిన మా ఇద్దరిలో నన్ను త్రుణికరించువారు నా భార్యను కూడా త్రుణికరించువారు అగుదురు కదా!! ఆలోచించుకో. 



2. గెత్సేమనే తోటలో యేసు చేసిన ప్రార్థనలో యేసు మరియు తండ్రి మధ్య ఉన్న ఏకత్వం (oneness) మరియు శిష్యులు మరియు తండ్రి మరియు యేసు మధ్య ఉన్న ఏకత్వం గురించి. 

(యోహాను. 17:11,20-22(: "నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగునవారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.౹ … మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.౹ మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.౹"  ఇది సంకల్పము యొక్క ఏకత్వము.


☑ నీవు(తండ్రి) నన్ను(యేసును) పంపితివని లోకము నమ్మునట్లు...

 తండ్రీ... మనము ఏకమై యున్నలాగున(20,22వ)

 ...వారును(అపోస్తలలు) మనమందు ఏకమైయుండవలెనని...(22వ)

 వారి(అపోస్తలలు) వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును(క్రైస్తవ సమాజం) ఏకమైయుండ వలెనని...(21వ)


ఏకమైయుండవలెనని అంటే ఒక్కడే/ ఒక్కరే అనే భావన ఇంకా ఉంటే వీటిని ఎలా వక్రీకరించుటకు పూనుకొంటావో నీ ఇష్టం.


📢 సారాంశం :

ఓ చదువరి... యోహాను 10:30 వచనం అనేది తండ్రి మరియు యేసు ఇరువురు ఉన్నారని, వారు దేవత్వములోని, చిత్తములోని, విమోచన విషయములోని ఒక్కటై యున్నారని..., ఒక్కడై లేరని  విషయాన్ని గుర్తించుము. బైబిల్ త్రిత్వము, త్రియేక దేవుడు అనే బోధలను సమర్థించదు.

తండ్రిని మరియు(and) కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹" (యోహాను. 2:22)

మీ ఆత్మీయులు.. 👪

WhatsApp Join Us   Telegram Join Us

ఇహలోక ప్రభుత్వము విషయములో క్రైస్తవులు పాత్ర (The role of Christians in local government)

 

ఇహలోక ప్రభుత్వము విషయములో క్రైస్తవులు పాత్ర


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏽 

                     అనంతజ్ఞానపూర్ణడగు పరమ దేవుడు ఆదిలోనే భూమ్యాకాశములు, సూర్యచంద్రాదులు, వృక్షాలు, జలచరములు, ఆకాశ పక్ష్యాదులు, భూజంతువులు, ప్రాకు పురుగులు సృజించాడు. సకల జీవులు ఏలికలేకయే  కాలము గడుపుచుండగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. (ఆది.కాం. 1:1-27). వాని పాదములు క్రింద ఉంచి, సమస్తముపై నరుడును ఏలుబడి చేయుటకు నియమించెను. (ఆది.కాం. 1:1-28; కీర్తనలు. 8:5-8). ఈయన అందరికి పైగా నున్నవాడే సదాకాలము మహాత్మ్యముగల మహారాజై యున్నాడు. (కీర్తనలు. 10:16; 95:3; యిర్మీయా. 10:10; ఎఫెసీ. 4:6). 

కాలక్రమేణ అనగా రమారమి 2500 సం.ల పిమ్మట చివరి న్యాధిపతియైన సమూయేలు కాలములో అప్పటివరకు ఇశ్రాయేలు ప్రజలకు నిరంతరం రాజైయున్న యెహోవా దేవుడు(కీర్తనలు. 10:16) తమకు రాజైయున్నాడని సంగతి జనులు గుర్తించక "...సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.౹"(1 సమూ. 8:5) దానిని గూర్చి సమూయేలు యెహోవాకు ప్రార్ధన చేయగా, యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.౹ వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.౹ అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము." (1 సమూ. 8:7-9)

యుగయుగములకు రాజైనున్న యెహోవా దేవున్ని యొక్క పరసంబంధమైన అధికారాన్ని ఇశ్రాయేలు జనులు విసర్జించి భౌతిక సంబంధమైన ప్రభుత్వం(లోక అధికారం చేయు రాజును) కోరినప్పుడు వారి రాజ్యాంగ చట్టం(ధర్మశాస్త్రం) సవరణ అవసరం లేకుండనే సాఫీగా సంగతులు కొనసాగేలా యెహోవా దేవుడు అట్టి ఏర్పాటును ముందుగానే వారి రాజ్యాంగ చట్టములో వ్రాయించి ఉంచెను. అదేమనగా... "నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి —నా చుట్టునున్న సమస్త జనమువలె నామీద రాజును నియమించుకొందుననుకొనినయెడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను.౹ నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.౹ అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా– ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.౹ తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసికొనకూడదు.౹ మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను;౹ అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలుమధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకుగాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను." (ద్వితీయో. 17:14-22).

తాము కోరుకొనిన భౌతిక సంబంధమైన రాజు తమ్మును పెట్టబోవు కష్టములన్నిటిని గూర్చి దేవుడు సమూయేలు ద్వారా ముందుగా ఆయా సంగతులు స్పష్టముగా తెలిపినను (1 సమూ. 8:10-18) ఇశ్రాయేలు జనులు దేవుని మాటలను చెవిని బెట్టనొల్లక "ఆలాగున కాదు,౹ జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.౹"(1 సమూ. 8:19-20). చివరిగా వారి మాటలు వినిన యెహోవా తన పర సంబంధమైన సింహానాన్ని భూమి మీదకి దించి సమూయేలు ద్వారా "తమ ప్రజలను ఏలుబడి చేయుటకు మొదటిసారిగా బెన్యామీను గోత్రపు వాడైనా సౌలు అను వ్యక్తిని సింహాసనం మీద కూర్చొండ బెట్టి, రాజుగా అభిషేకించి, ప్రజలకు అధిపతిగా నియమింపజేసెను. (1 సమూ. 8:21 నుండి 10:1).


✅ మొదటిగా దేవుని ప్రజలకు ఇహలోక ప్రభుత్వమనేది ఇక్కడే ప్రారంభం మయ్యింది. 

✅ ప్రభుత్వమైన, రాజునైన/అధికారులైన నియమించువాడు యెహోవా దేవుడు మాత్రమే. జనులు ఎంతమాత్రం కాదు. 

📖 "యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు." (యిర్మీయా. 10:10).


అనాడు తమ ప్రజల మధ్య ప్రారంభమైన అట్టి ప్రభుత్వమే నేడు కూడా భౌతిక సంబంధమైన రూపములో కొనసాగబడుతుందని నీవు గుర్తిస్తే... క్రైస్తవుడువైన నీవు ఇహలోక ప్రభుత్వము విషయములో నీ పాత్ర ఏమిటో గుర్తించుటకు ప్రయత్నం చేయుము. 


1️⃣. ప్రభుత్వాలను దేవుడే ఏర్పాటు చేస్తున్నారని నీవు ఎరగాలి. 

"మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను —ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి.౹ అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి.౹ ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.౹ ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.౹" (దానియేలు 4:13-17):

"రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.౹ దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్టములును జనులును ఆయా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.౹ అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను.౹ అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.౹" (దానియేలు 5:18-21):


2️⃣. దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వమునకు నీవు లోబడవలసిందే.

"అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,౹ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.౹" (తీతుకు. 3:1-2)

"ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ.వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.౹ కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.౹ ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడుచేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారముచేయు దేవుని పరిచారకులు.౹ కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షినిబట్టియు లోబడియుండుట ఆవశ్యకము.౹" (రోమా. 13:1-5)

"మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి.౹ రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.౹" (1 పేతురు. 2:13-14)


3️⃣. ప్రభుత్వమునకు నీవు పన్ను చెల్లించాలి.

 "ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.౹ ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి." (రోమా. 13:6-7).

 "వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి– బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ని చ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి– మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి, ఆయన– ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారు– కైసరువి అనిరి. అందుకు యేసు — కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి." (మార్కు. 12:13-17)


4️⃣. అనుదినం ప్రభుత్వము కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి. 

 "మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును౹ రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.౹ ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది.౹" (1 తిమోతి. 2:1-3).

మీ ఆత్మీయులు

WhatsApp Join Us   Telegram Join Us
వేటి పైన క్రైస్తవులు పోరాటం?

The churches of Christ greet you - Roma 16:16