సత్య అన్వేషకులు చేత అపార్ధము చేయబడుతున్న (యోహాను. 14:6-11 వచనములు)
సహోదరీ,సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
యోహాను 14: 6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.సమస్త మానవ జాతి తండ్రి యొద్దకు చేరుటకు యేసు వారు మార్గము, సత్యము, జీవము అని బాగుగా తెలియాలి. యేసు ద్వారానే తప్ప మరి ఏ ఒక్కరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు.
తండ్రి ఎక్కడ ఉన్నారు .?
● "పరలోకమందున్న మా తండ్రి" - (మత్తయి. 6:9).● "సర్వాంతర్యామి అనగా అన్ని చోట్ల ఉన్నవారు" - (కీర్తన. 139:7-10).
◆ "నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు". -(ద్వితి.కాం. 10: 17).
యెహోవా ఎవరుకి తండ్రి..?
● "మీ తండ్రి" - (మత్తయి. 5:48 7:11).● "నీ తండ్రి" - (మత్తయి. 6:4,6,18).
● "నా తండ్రి" (యేసువారికి కూడా తండ్రి) - (మత్తయి. 7:21; 10:32).
● "మనకు తండ్రి" - (1 కోరింథీ. 8:6)
ఈ వాక్య ఆధారములు చూసాక తండ్రి వారు యేసు రూపములో వచ్చారు అని అపార్ధము చేసుకొనవసరం లేదు.
యోహాను 14: 7-9
మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
ఈ వచనములులో యేసు వారు మూడు సార్లు "ఎరుగుట" గూర్చి మాట్లాడటం జరిగింది.
◆ ఎరుగుట అనగా తెలుసుకొనుట, గ్రహించుకొనుట
యేసును గూర్చి ఏమి తెలుసుకోవాలి..?
● " తన ప్రజలను వారి పాపములనుండి రక్షించుటకు యేసు పుట్టారు" అని- (మత్తయి. 1:21)
● "యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు" అని - (మత్తయి. 16:16).
● "మన యెడల ఉండే తండ్రి యొక్క చిత్తము జరిగిoచుటకును, తండ్రి రొమ్మున నుండి యేసు ఈ లోకమునకు పంపబడినవాడు, మన మధ్యకి వచ్చి తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణముగా నేరవేర్చాడు" అని - (యోహాను. 5:24,36-38, 17:4).
● "లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" అని - (1 కోరింథీ. 15: 3).
"తండ్రి యొద్ద నుండి ఈ లోకమునకు వచ్చి మరల ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్లారు" అని - (యోహాను. 1:18; 16:26-27; 6:57; అపొ.కార్య. 2:32-36).
యేసు ఎవరు అనేది నిజముగా ఎరిగి ఉంటే యేసును మన కొరకు పంపిన ఆ ఒక్క తండ్రిని కూడా క్రీస్తు బలి ద్వారానే వారు(తండ్రి + కుమారుడు) ఇరుగురు అని తెలుసుకొనే స్థితి కలుగుతాది.
యోహాను 14: 8-10
అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగాయేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.
ఈ మూడు వచనములలో "పిలిప్పునకు మరియు యేసుకి మధ్య సంభాషణ".
"పిలిప్పు భౌతికముగా ఆలోచన చేసి తండ్రిని చూడాలి అని ఉంది అని యేసును అడిగినట్టుగా చూడగలము. దీన్ని బట్టి పిలిప్పు ఆయనను సరియైన రీతిలో తెలుసుకోలేకపోవడమే".
"నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు" - (యోహాను. 14:9).
ఈ వచనము పట్టుకొని నీవు ఇలా అనుకోవచ్చు తండ్రియే మన మధ్యకి యేసు వలె వచ్చారని ఆలోచన ఉంటే ఈ క్రింది వచనములు విషయములో నీవు సత్యము ముందు మౌనము వహించవలసిన అవసరము కలుగును.
◆ యోహాను 1: 18
"ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు".
◆ యోహాను 6: 47
"దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్నవాడు".
◆ 1యోహాను 4: 12
"ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు".
★ నన్ను చూచినవాడు అనగా యేసు ఎందుకొరకు వచ్చారో, ఏమి ప్రకటన చేసారో, ఎందుకు మరణించారో, ఎందుకు తిరిగి లేచారో అని పరిశీలన చేయువాడే తండ్రి యొక్క మనస్సు, ప్రేమ, మన యెడల చిత్తమును జరిగించు యేసు ద్వారా తండ్రిని చూచువాడు అని అర్ధము."
● యేసు వారు "తండ్రి యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను". - (యోహాను 8:26)
ఈ విషయాలను కొందరు ఎరుగకపోవడము వలననే తండ్రి వారు యేసు అని వాక్యమును అపార్ధము చేసుకొనుచున్నారు.
యోహాను 14: 11
తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.అవును...
◆ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది -
(కొలొస్స 1:19).
◆ యేసు దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, - (హెబ్రీ 1: 3).
Note:- ఈ వచనములోనే కాదు బైబిల్ అంతటిలో యేసు వారు ఎక్కడ కూడా "నేను తండ్రిని అని" చెప్పుకోలేదు.
● యేసు మన మధ్యకు రక్షకుడుగా మరియు దేవుని కుమారుడుగా పుట్టి (మత్తయి 1:21; యోహాను. 3:16) దాసుని స్వరూపము ధరించి (ఫిలిప్పీ. 2: 6) సమస్త జనులు పాపములు కొరకు అక్రమకారులు చేత సిలువ వేయబడి, సమాధి చేయబడి, మూడవ దినమున తండ్రిచేత లేపబడెను. (లూకా. 24:47; అపొ.కార్య 2:23-24,32; 1 కొరింథీ 15:3-4; 1పేతురు. 2:24).
●అటు పిమ్మట, పరలోకమును ఆరోహణమయ్యి, యేసు వారు తండ్రి కుడిపార్శ్వమున హెచ్చింపబడి "తండ్రి చేత ప్రభువుగాను, క్రీస్తుగాను నియమింపబడ్డారు". (అపొ.కార్య. 1:9; 2:33, 35-36)
కాబట్టి నా ప్రియులరా... ఇకనైనా ఆలస్యము చేయక వాక్య పరిశీలన చేసి, ఈ దినమే వారు (తండ్రి + కుమారుడు) ఇరుగురు అనే గొప్ప సత్యమును అంగీకరించుము.
యోహాను 17: 3
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును
+
నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే.
(నిత్య జీవము).
మనోహర్ బాబు గుడివాడ ©
1 comments:
commentsDear Brother, People often showing Isiah 40:3 to show Jesus and Jehovah are same person. It is because John the baptist prepared a way to Jesus. Kindly, explain me this . Thank you.
ReplyYour Brother in Christ
Ch. Veerabrahmam, 8897383702
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com