Showing posts with label యోసేపు. Show all posts
Showing posts with label యోసేపు. Show all posts

“వివాహము” (పార్ట్ - 01) Wedlock

వివాహము” (పార్ట్ - 01)


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రియులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. 

            "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను” (హెబ్రె. 13:4). వివాహము అనే విషయముపై నేటి కాలములో అనేకులు సరైన అవగాహనా మరియు లేఖనానుసారమైన జ్ఞానములేక తప్పిదము చేస్తూ లోకానుసారమైన జ్ఞానము చొప్పున మరియు వారి స్వనీతిని ఆధారము చేసుకొంటూ  కార్యక్రమమును తప్పుడుగా జరిగిస్తూ పరమదేవుడు ఏర్పాటు చేసిన వివాహం అనే గొప్ప వ్యవస్థను  తప్పుదారి పట్టిస్తున్నారు.   వివాహం అనే అంశమును నాలుగు భాగాలుగా నేర్చుకొందాం ఇది మొదటి భాగము.  

    వివాహ వ్యవస్థ గూర్చి యెరిగి దాని విషయములో లోకజ్ఞానాన్ని అనుసరించే వారి నిమిత్తము ఏమి చేయలేము గాని తెలియక అపార్ధం చేసుకొంటున్న వారు తమ జీవితాలు ఇకనైనా సరిచేసుకోవాలని   అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. 


I. వివాహము అనగా ఏమిటి

భిన్నత్వములో ఉన్న ఇద్దరు వ్యక్తులు(స్త్రీ & పురుషుడు) ఏకత్వమగుటకు దేవునిచే జతపరచబడుటకు జరుగు దైవకార్యమును వివాహము అందురు.

⟹ గ్రీక్ లో - γάμος - gamos - gam'-os (G1060, G1062)

⟹ ఇంగ్లీష్  లో  marriage, wedding, wedlock 


భిన్నత్వము నుండి ఏకత్వము అనగా ఏమిటి

వరుడు, వధువు వివాహానంతరము హృదయము, మనసు, మనసాక్షి లలో భిన్నత్వము నుండి ఏకత్వమగుట.అనగా కోరికలలో, ఆలోచనలలో, ప్రణాళికలలో, నిర్ణయాలలో, కార్యాచరణలలో, అలవాట్లలోఅనుభూతులలో భిన్నత్వము నుండి ఏకత్వమగుట.

➾ మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. (మత్తయి సువార్త  18: 19)

➾ ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను. (1 కోరింథి. 7:2)

 

II. వివాహం ఎందుకు? 

𝗔). పురుషుడు ఒంటరిగా ఉండకూడదని :

పరమదేవుడు ఆదిలో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయకమునుపే నరజాతి కొరకు భూమ్యాకాశములను, వృక్షజాలము, జలచరములను, ఆకాశ పక్షులను, పశువులను, పురుగులను, జంతువులను  సృజించెను. (ఆది.1:1-23. cf). 

➾ అటు తరువాత, "దేవుడుమన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. (ఆది. 1:26-27). 

నరుని నిర్మాణముతో, దేవుని సృష్టి నిర్మాణం కార్యక్రమం ముగిసింది. దేవుడు తన సృష్టి యావత్తును గురించి మాట్లాడినప్పుడు అది మంచిదని చెప్పెను. (ఆది. 1:4,10,12,19,21,25,31). అయినప్పటికీ ఆయన ఒక లోటును కనుగొనెను అదేమనగా, "మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను. (ఆది. 2:18).

సాటియైన సహాయం అనగా జీవిత భాగస్వామి అని అర్ధం.

సృష్టి యావత్తులో నరునికి సాటియైన సహాయం లేదని/అతను ఒంటరిగా ఉండుట మంచిది కాదని యెరిగిన దేవుడు సాటియైన సహాయమును పురుషునికొరకు చేయుదుననుకొనెను. ఐతే  వివాహ ఆలోచన బయటకు రాలేదు.

➾ "అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు." (ఆది. 2:20-24) 

దేవుడే ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి( మొట్టమొదటగా ఏదెను తోటలో జరిగిన ఆపరేషన్) ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చెను. కానీ ఆమె యొద్దకు అతన్ని తీసుకుపోలేదు.

స్త్రీయే  పురుషుని కొరకని  గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. (1 కొరింథి. 11:8-9. cf.)

పురుషుని కొరకై స్త్రీ నిర్మింపబడినదని స్త్రీ కొరకు పురుషుడు కాదని పరిశుద్ధ గ్రంథము ఖండితముగా చెప్పుతుందని విశ్వాసముతో రూఢిగా నమ్మవలసిన అవసరత ఉన్నది . 

వివాహపు  వ్యవస్థాపకుడు పరిశుద్ధ పరమదేవుడే గాని మనిషి కాదు. 

కేవలం దేవుడే పెద్దగా లేదా మధ్యవర్తిగా ఆదాము మరియు అవ్వ ను నిబంధన మేర జత పరుచుటం చూడగలం.


(గమనిక) : ఆదాము/అవ్వకు జననం, బాల్యం, యవ్వనం దశలు యొక్క అనుభవం లేదు.

 ఆదాము కి తల్లి, తండ్రి కలవాడు కాదు. కానీ మాటలు తో వివాహం వ్యవస్థ తల్లితండ్రులు గల తాత్కాలిక లోకములో శాశ్వతంగా ఉద్దేశించబడినట్టుగా చూడగలం. 

వివాహం ద్వారా పురుషుడు తన తల్లిని/తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనుట చేత వారిద్దరూ ఏక శరీరమైన్నారు. 

 

𝗕). జారత్వం జరగకూడదని : 

"జారత్వం" అనగా అవివాహితులు శృంగార కార్యకలాపాలకు పాల్పడడం. గ్రీక్ భాషలో porneia అని ఇంగ్లీష్ లో Fornication (or) Sexual Immorality. వివాహం కానీ స్త్రీ పురుషులు మధ్య మరియు వివాహమైన పురుషుడు/స్త్రీ - - వివాహం కానీ పురుషుడు/స్త్రీ మధ్య జరిగే శృంగారపు ఆలోచనలు/చూపులు/కోరికలు/నిర్ణయాలు జరుగుటయే జారత్వం. 

జారత్వం దేవుని చిత్తం కాదు. (1 దెస్స. 4:3-5)

జారత్వం మనుషుల హృదయములో నుండి పుట్టును. (మార్కు. 7:21).

జారత్వం జరుగకుండా ఉండాలంటే దైవిక వివాహమే పరిష్కారం.

కేవలం వివాహపు పరిధిలోనే శృంగార కార్యకలాపాలనేవి దేవునికి అంగీకార యోగ్యమైనవి. దాని వెలుపల కనీసం పురుషుడు/స్త్రీ ను స్త్రీను/పురుషుడును మోహపు చూపుతో చూడకూడదని (మత్తయి. 5:27-28 cf.) మరియు వారి పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెనని (హెబ్రే. 13:4 cf). వివాహ వ్యవస్థను దేవుడే ప్రారంభించడము జరిగింది.

వివాహ నిబంధనలో బంధింపబడిన స్త్రీ, పురుషులు మాత్రమే భార్యభర్తలౌతారు. (ఆది. 2:25). కాబట్టి అది జారత్వం అనబడదు.

స్త్రీ/పురుషులు వివాహ బంధముచే బంధింపబడకుండా ఇరుగురు కలసి సహజీవనం చేసిన, వివాహమునకు ముందు శారీరకంగా కలసిన, దైవ నిబంధన ప్రవేశం లేకమునుపే, పరిశుద్ధులు అనగా సంఘము యొక్క యెదుట జత చేయబడకుండానే తమకుతాము  భార్యభర్తలుగా ఊహించుకొని, తల్లితండ్రులు మరియు పెద్దలు ప్రమేయం లేకుండా తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొంటూ తమ కోరికలు తీర్చుకొనుట జారత్వమే  అగునుకదా! ఇలా చేయువారు దేవుని దృష్టికి పాపం చేయువారు కానీ పరిశుద్ధులు కాలేరు సుమా. 

నా ప్రియ యవ్వనస్తుడా ఇంత నిష్ఠగా బ్రతకగలరా? అని సందేహం నీకు ఉండునేమో గాని సుందరుడు, రూపవంతుడును మరియు యవ్వనస్తుడైన యోసేపు నీకు కలిగే ఆలోచనలకు గొప్ప ఉదాహరణ. (యోసేపు అంశము కొరకు క్లిక్ చేయు)

➾ "స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను." (1 కోరింథి. 7:1-2).

➾ "జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. (1కోరింథి. 6:18).


𝗖). మానవజాతి విస్తరణ మరియు దైవకుటుంబ నిర్మాణం కొరకు :

➾ "దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను." (ఆది. 1:28). 

➾ "మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు." (అపో.కార్య. 17:26).

యావద్భూమిమీద కాపురముండుటకు, ఫలించి అభివృద్ధి చెందుటకు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుటకు కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశారు. 

ఇహలోక సంబంధమైన వాటి కొరకు వివాహం కాదు.

 

𝐃). మేలు కలుగుటకు/దైవ చిత్తముగా నడిపింపబడుటకు :

➾ "దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ..." (కీర్తన. 68:6).

➾ "భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు." (సామెతలు. 18:22).

➾ "..... సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము." (సామెతలు. 19:14).

 ➾ "ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?" (ప్రసంగి. 4:9-12).

 

III. వివాహము ఎవరికి?

పరిశుద్ధ గ్రంథము భిన్నత్వముగల  ఇద్దరు వ్యక్తులకు  అనగా పురుషుడు  స్త్రీ మాత్రమే  వివాహమనే బంధము చేత జతపరచబడాలని తెలియజేస్తుంది. 

⟿ పురుషుడు + పురుషుడు = ️ 

⟿ స్త్రీ + స్త్రీ =

⟿ పురుషుడు + స్త్రీ =

        ➦ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు. (ఆదికాండము. 2:24)

➦ ఆయనసృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. (మత్తయి సువార్త. 19: 4-6)

➦ సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. (మార్కు సువార్త 10:6-9)

(ముఖ్య గమనిక :) వివాహమనేది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తోటి పరిశుద్ధులను క్రీస్తునకు మరియు  దేవునికి దగ్గర చేయబడుటకే  గాని నీకు జత చేయబడిన వారి సొంత  ఆలోచనలకు లోబడి సంఘానికి మరియు దేవునికి దూరం అగుటకు మాత్రం వివాహ వ్యవస్థ  ఏర్పాటు చేయబడలేదు .  

కాబట్టి సహోదరి/సహోదరుడా.. పైన తెలుపబడిన మాటలను బట్టి  దేవుడు ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వివాహం వ్యవస్థ గూర్చి నీ ఆలోచన ఏమైయున్నదో గ్రహించుకో.

NOTE : నీ గురి నిత్యత్వమే  అయ్యిఉండాలి గాని  వివాహం కాదు.  వివాహం చేసుకోవద్దని మా ఉద్దేశ్యము కాదు గాని నీ వివాహం నిన్ను నిత్యత్వమునకు  దూరము చేయకూడదని మా ప్రేమ పూర్వకమైన హెచ్చరిక. (1 కొరింథి. 7:1 cf) నీవు వివాహం చేసుకొనినను, చేసికొనక పోయినను నిత్యత్వం పొందాలనేది దేవుని చిత్తము.

ఐగుప్తు దేశము (The land of Egypt)

ఐగుప్తు దేశము - The land of Egypt


         అబ్రాహాము, తన కుమారుడైన ఇస్సాకు, అతని కుమారులైన యాకోబు ఏశావులు కానాను దేశములో నివసించిరి. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు పోవుచున్న ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మబడెను. కాని దేవుడతనికి తోడైయున్నందువల్ల అతడు అన్ని శ్రమల నుండి రక్షింపబడి తుదకు ఆ దేశమునకు ప్రధానమంత్రి అయ్యెను.

          ఖల్దియ దేశమువలె ఐగుప్తుకూడ నవనాగరికతలు గల దేశము. పురాతన వస్తు శాస్త్రజ్ఞులు ఆ దేశములో కూడా త్రవ్వకాలు సాగించి అనేక విలువగల వస్తువులను కనుగొనిరి. ఐగుప్తీయులు 'పిరమిడ్స్' అను గొప్ప గోరీలు, ఐగుప్తు రాజుల సమాధుల కొరకై కట్టించిరి. అవి నేటి వరకు నిలిచియున్నవి. ఆ సమాధులలో ఒకదానియందు అంటే 'టూటన్ కామెన్' అను యువరాజు యొక్క సమాధిలో విస్తారమైన బంగారు వస్తువులు దొరికినవి. బంగారముచే పొదిగించబడిన ఒక సింహాసనము, బంగారు ఆయుధములు, అద్దము, కలము, నగలు మొ||నవి.

          ఆ దేశ ప్రజలు సూర్యారాధన చేసెడివారు. మరియు అన్నిరకాల క్రిమికీటకాదులను, ముఖ్యముగా పెంకు పురుగును పూజించెడివారు, భారత దేశములో ముఖ్య నదులను పుణ్యనదులని పూజించుచున్నట్లే వారు నైలునదిని పూజించెడివారు. ఎందుకనగా ఆ దేశ సిరిసంపదలన్నియు దానిలో గుప్తమైయున్నవని వారి నమ్మకము. నైలు నీరు ప్రవహించని భూములు కేవలము యిసుకమయమైన ఎడారిగా నున్నవి. దేవుడు ఐగుప్తీయుల మీదికి ఆ పది తెగుళ్ళు పంపించినపుడు వారి ఆరాధ్య దేవతలన్నిటిపై అధికారము యెహోవాకే కలదని వారికి తెలియ పరిచెను. సూర్యుడు, నైలునది అందులో నివసించెడి జలచరములు, కప్పలు కీటకములను ఆయన మొత్తెను. ఇవి వారి ఆరాధ్య దేవతలు. కాని మోషే రప్పించిన పది తెగుళ్ళును ఆ దేవతలకు తలవంపులు తెచ్చినవి.  ఐగుప్తు శకునగాండ్రు సహితము ఆ పరాభవమును ఆపుచేయలేకపోయిరి. తద్వారా ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా సర్వశక్తిమంతుడని గ్రహించుకోగలిగిరి.
 
"సార్కా పగస్
          ఐగుప్తు దేశములోని ప్రతి రాజుకు ఫరో అను బిరుదు ఇవ్వబడెను. ఫరో అను మాటకు గొప్ప వంశస్థుడు, చక్రవర్తి అని అర్థము. ఆ కాలములోని రాజులందరు దేవుండ్లుగా ఎంచబడిరి. అందున వారు తమ యిష్టము వచ్చినట్లుగా శాసనములు గావించినను ఎవరును వారికి ఎదురు చెప్పలేకపోయిరి. వారు సూర్యకుమారులని కూడా పిలువబడిరి. కనుక వారు చనిపోయినపుడు వారి ఆత్మలు నెలునది మీద ప్రయాణము చేసి సూర్యభగవానునిలో లీనమైపోవునని ఐగుప్తీయులు తలంచేవారు. అందున ఒక మహారాజు మరణించినపుడు అతని మృత కళేబరముతోపాటు, జీవనోపాధి కొరకై ఒక పడవ, ఒక రథము, ఆహార సామాగ్రి, దుస్తులు వారు వాడుకొను బంగారు ఆభరణములు, అతని రత్నఖచిత సింహాసనము వారి గోరీలలో ఉంచెడివారు. ఒక రాజు చనిపోయినపుడు అతని సేవకులు కూడా విషము త్రాగి మరణించు అలవాటు ఆరంభములో కలదు. అప్పుడు వారి మృత కళేబరములను కూడా రాజు మృత దేహముతో నుంచెడివారు. అయితే రాను రాను ఆ ఆచారమును ఆపివేసి, మట్టితో చేయబడిన దాసదాసీల బొమ్మలు, మృతమైన రాజు సేవలకు సమాధలో నుంచెడివారు మరియు రాజుల మృతదేహములను విలువగల సుగంధ లేపనములు పూసిన గుడ్డతో చుట్టెడివారు. తదుపరి ఆ మృత దేహమును మనిషి ఆకారముగల శవపేటికలోనుంచి ఆ రాజు ముఖమును, అతని దేహ నిర్మాణమును వున్నది వున్నట్లు రంగులతోను,  వెలగల రాళ్ళతోను, ఆ పేటికపైన చిత్రించెడివారు. ఆ పెటెల పేరు "సార్కా పగస్. సుగంధ లేపనములతో చుటబడిన దేహమును మమ్మి అంటారు. (ఆది 50:2-3). సామాన్యమైన ప్రజలు కూడా తమ కుటుంబములో చనిపోయిన వ్యక్తుల శవములకు అదేవిధముగా సుగంధ ద్రవ్యములు పూసిన బట్ట చుట్టెడివారు.
ఐగుప్తు దేశములో వర్షపాతము కడు అల్పము. అందువల్ల అప్పటి రాజుల మృతదేహములు 2000 క్రీ.పూ. నుంచి నేటివరకు చెక్కు చెదరక అలాగే నిలిచియున్నవి. అనగా దాదాపు 4000 సం.లు పురావస్తు శాస్త్రజ్ఞులు వాటిని గోరీలనుండి తీసి అనేక యితర దేశములకు వంటి వస్తు ప్రదర్శనశాలలలో వాటిని వుంచిరి. టూటాన్ ఖామెన్ యువరాజు యొక్క సమాధిలో లభ్యమైన అపారసంపద, వస్తువులు ఐగుపు దేశములో నేటికిని చూడగలము.
          
 హిరోగ్లిఫిక్స్
          ఐగుప్తు దేశీయులు తమ వ్రాతలు మట్టి పలకల మీద వ్రాయలేదు. గాని జమ్ము, రెల్లు కలిపి అల్లి  వాటి మీద బొమ్మల సంకేతములతో వ్రాత వ్రాసి వాటిని  చుట్టగా చుట్టెడివారు. అది 'పెపరస్' అనబడెడిది. అయితే ఆ వ్రాత చాలాకాలము నిలువలసి వచ్చినప్పుడు వారు గోడలపై బొమ్మలను, బొమ్మల వ్రాతలను చెక్కిరి. ఆ విధముగా చెక్కిన స్థూపములకు అనగా మనుష్యులకు, పక్షులకు, జంతువులకు రంగులు పూయగా ఆ గోడలు ఎంతో రమ్యముగా కనబడెడిని, గోడలపై చెక్కబడిన స్థూపములను బట్టి  వ్రాతలనుబట్టి ఆనాటి పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసికొనవచ్చును.  ఆ కాలములో విద్య చాలమట్టుకు జ్యోతిష్కములతో కూడియుండెను. సంపన్న కుటుంబికులు మాత్రమే పూజారుల దగ్గర చదువు నేర్చుకొనగలిగిరి. గణిత శాస్త్రము విచిత్రమైన పద్దతిలో నేర్పబడెను. రానురాను వారు బొమ్మల వ్రాత మానివేసి గుర్తులు పెట్టుటను నేర్చుకొనిరి. ఆ బొమ్మల వ్రాతను హిరోగ్లిఫిక్స్ అందురు.

          యాకోబు తన కుమారుడైన యోసేపును కలుసుకొనుటకు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అతని కుటుంబములో 70 మంది ఉండిరి (ఆది. 46:27). వారు గొర్రెలను మేపెడి ప్రజలు. కాని గొర్రెలు ఐగుప్తీయులకు హేయమైన జంతువులు గనుక ఫరో వారిని గోషేను అను ప్రాంతములో నుంచెను. అది ఐగుప్తునకు ఫిలిష్తియుల దేశమునకును మధ్యనున్నది. అక్కడ యాకోబు సంతానము మిక్కిలి విస్తరించి వేలకొలదిగా అభివృద్ధి చెందిరి. సుమారు 250 సంవత్సరములు అయిన పిమ్మట రామసేసు 2 అను ఒక క్రొత్త ఫరో వారిని బాధింప మొదలు పెట్టెను. అతడు 60 సంవత్సరములు ఐగుప్తును ఏలెను (క్రీ.పూ. 1290-1224).

          అతడు వారిచే వెట్టి పనులు చేయించి తన పేరు చిరస్మరణీయముగా నుండుటకు పితోము, రామసేసు అనే పట్టణములను కట్టించుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు 150 సంవత్సరముల వరకు అనేక శ్రమలను అనుభవించినను వారింకను విస్తరించి గొప్ప జనాంగమైరి. దేవుడు పసిబాలుడైన మోషేను రక్షించి తుదకు అతని ద్వారా ఇశ్రాయేలీయులను ఎట్లు ఐగుప్తీయుల వశములో నుండి రక్షించెనో మనకు తెలిసిన విషయమే (నిర్గమ. 1 అధ్యా. 12 అధ్యా.,) ఆ సంఘటనలు రామసేసు -2 కాలములో జరిగినవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి క్రీ.పూ. 1280లో విమోచింపబడిరి.
The churches of Christ greet you - Roma 16:16