Showing posts with label కుమారుడు. Show all posts
Showing posts with label కుమారుడు. Show all posts

"పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడా?" (Is the Holy Spirit son of God?)

పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడా?


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు క్రైస్తవ్యములో కొందరు బోధకులు తండ్రికి మొదటి కుమారుడు యేసుక్రీస్తని, రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడని భిన్న బోధలు చేస్తూ వాక్యమును అపార్థము చేయుచున్నారు. వీరు గ్రంథములో రెండు వచనములను ఆధారము చేసుకొని దేవుని రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడని వాక్యమును వక్రీకరణ చేయుచున్నారు. అవేమనగా,

◆ ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొంద లేదు గాని, దత్త పుత్త్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము - అబ్బా, తండ్రీ, అని మొర్ర పెట్టుచున్నాము. – (రోమా. 8:15).
◆ మీరు కుమారులై యున్నందున - నాయనా, తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. – (గలతీ. 4:6).

పైన వ్రాయబడిన రెండు వచనములను మాత్రమే చదివి పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడని బోధ చేయుచున్నారు కాని ఆ పత్రికలో ఉన్న ఆ యా అధ్యాయములలో గల సారాంశమును గ్రంహించలేకపోతున్నారు.

★ దాస్యపు ఆత్మ (spirit of bondage) అనగా, ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారియొక్క మానసిక ఒత్తిడి, పాపము మరియు మరణము.

★ దత్త పుత్త్రాత్మ (spirit of adoption) అనగా స్వీకృత ఆత్మ లేదా సమాన వారసత్వముగా అంగీకరింపనడినది.

★ కుమారుని ఆత్మ (spirit of son or nature of Christ) అనగా క్రీస్తు యొక్క ఆత్మ లేదా క్రీస్తు యొక్క స్వభావము.

అపోస్తులుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘము వారికి ధర్మశాస్త్రములో దేవునిచేత  నియమింపబడిన ఆజ్ఞలను వివరిస్తూ, ధర్మశాస్త్రమును ఎంతో పవిత్రముగా ఆచరించిన పౌలు గారు సైతము తన మరణమునకు లోనగు శరీర విషయములో దౌర్భాగ్యుడని ఎంచుకొనుచూ (రోమా. 7:23-24), వారు ధర్మశాస్త్రమునకు లోబడి (రోమా. 6:16), దాసులుగా ఉన్నారనీ (రోమా. 7:1-3), ధర్మశాస్త్రము నిత్యజీవము కలుగజేయదని తెలియజేస్తూ (రోమా. 6:21-22; 7:12-14), తండ్రి తన సొంత కుమారుని మరణము నొదించుటచేత పాప పరిహారము పొందియున్నాము (రోమా. 8:1-4) కనుక ధర్మశాస్త్రము క్రిందున్న వారిని అనగా, ఆ “దాస్యపు ఆత్మ” కలవారిని విడుదల కలుగజేసి తన కుమారుని ఆత్మను అనగా తన కుమారుని ద్వారా మనలను దత్త పుత్రులుగా స్వీకరించి క్రీస్తు స్వభావము కలిగియుండాలని (రోమా. 8:13-16; గలతీ. 4:19) తన కుమారుని ఆత్మ మన హృదయములోనికి పంపియున్నాడని (గలతీ. 4:6-7) రోమాలో ఉన్న సంఘమునకు చెప్పబడిన సంగతులను మనము రోమా పత్రిక 7 మరియు 8వ అధ్యాయములో చూడగలము.

తండ్రికి అద్వితీయ కుమారుడు ఒక్కడే :


★ అద్వితీయుడు అనగా ఒక్కడే, సాటిలేనివాడు, ఇంకొకరితో పోలిక లేనివాడు, సమానము లేనివాడు.

» ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. – (యోహాను.1:14).
» ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. – (యోహాను. 1:18).
» దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. – (యోహాను. 3:16).
» ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. – (యోహాను. 3:18).
» మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. – (1 యోహాను. 4:9).

హెచ్చరిక :


» తండ్రికి ఒక్కడే కుమారుడని పరిశుద్ధాత్ముడే పై వచనముల ద్వారా ఖండితముగా తెలియజేస్తుండగా పరిశుద్ధాత్ముడు దేవునికి రెండవ కుమారుడని సొంత బోధ చేయుట ఎంతవరకు సమంజసము?
» పరిశుద్ధాత్ముని గూర్చి పూర్తి వివరణ కావాలంటే పరిశుద్ధాత్ముడు, పాత నిబంధనలో మరియు  క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పని అంశములను చూడగలరు.


కాబట్టి ప్రియులారా, వాక్య పరిశీలన చేసి అపోస్తులుల బోధలో నడుచుకుని దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు, 
మనోహర్ నవీన

"దేవుని కుమారుడు" (Son of God)

అంశము : దేవుని కుమారుడు (son of God).

సహోదరులందరికిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నా ప్రియులారా, క్రైస్తవ్యములో అనేకమంది మనుష్యులలో బోధలు, సిద్ధాంతాలు, ఆలోచనలు చోటు చేసుకోవడము వలన "దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములో సరైన ఏకత్వము లేకపోవడము" వలన సంపూర్ణ పురుషులు కాలేకపోతున్నారు.


క్రైస్తవ్యములో మూడు రకాల కట్టు కథలు


1). తండ్రియైన యెహోవా దేవుడే కుమారుడుగా (యేసుక్రీస్తుగా) ఈ లోకమునకు శరీరధారియై వచ్చారని.
2). జగత్తు పునాది వేయబడక మునుపే యేసు దేవుని కుమారుడుగా పిలువబడ్డారని.
3). అనాదిలో యెహోవా దేవుడు యేసును సృష్టించారని.

ఈ లోకములో దేవుని కుమారుని గూర్చిన  కట్టుకధలు అనేకమైనవి కలవు గాని ప్రస్తుతమున్న ముఖ్యమైన వాటిని పరిగణలోనికి తీసుకొని, వాక్య పరిశీలన చేసి, వాక్య ఆధారములుతో, మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను.


A). "తండ్రి వారు ఈ లోకమునకు కుమారుడుగా వచ్చారా.."?.

(కాదు)

యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను(యేసుక్రీస్తు), వాక్యము దేవుని(యెహోవా) యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

యోహాను 1: 14
వాక్యము(యేసుక్రీస్తు) శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
 తండ్రివలన(యెహోవా) కలిగిన అద్వితీయకుమారుని (యేసుక్రీస్తు) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

గమనిక :- "తండ్రివలన(యెహోవా) కలిగిన అద్వితీయకుమారుని(యేసుక్రీస్తు)".


B). "జగత్తు ముందే యేసు దేవుని కుమారుడా.. "?.

(కాదు).

యోహాను 1: 1
"....వాక్యము దేవుడై యుండెను"

యోహాను 3: 16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన "అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు" విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

గమనిక :- "అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు".


C). "తండ్రి అనాదిలో యేసును నిర్మించారా.."?

(లేదు).


● యేసు అనాది నుండి దేవత్వపు లక్షణములు కలిగి తండ్రితో సమానముగా ఉన్నారు.

ఆదికాండము 1: 26
దేవుడు "మన స్వరూపమందు"
"మన పోలికె చొప్పున" నరులను చేయుదము.
ఫిలిప్పీయులకు 2: 6
ఆయన "దేవుని స్వరూ పము" కలిగినవాడైయుండి, "దేవునితో సమానముగా" ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు.
కొలస్సీయులకు 2: 9
"దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత" శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.

★ ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడినప్పటికి (లూకా. 3:38). "దేవత్వము లక్షణములు కలిగినవాడు కాదు".


"దేవుని కుమారుని గూర్చిన వివరణ"


"దేవుని కుమారుడు" అనగా దేవుని ప్రజలను యుగయుగములు ఏలుబడి చేయువాడని అర్ధము.


■ "కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి..." - (గలతి. 4:4).

■ అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. ( గలతి. 3:16).

■ "అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు..." (మత్తయి. 1:1).

■ పరమ తండ్రి ఏలుబడిని ఇశ్రాయేలు ప్రజలు విసర్జించి, తమకు లోకసంబంధమైన రాజును నియమించమని సమూయేలును కోరగా, సమూయేలు యెహోవా కి ప్రార్థన చేసి, యెహోవా మాట చొప్పున వారికి భౌతికసంబంధమైన మొదటి రాజును నియమించెను. - (1 సమూయేలు. 8:1-22; 9:2,17).

■ లోక సంబంధమైన అనేక మంది రాజులు ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేసి, యెహోవా ఆజ్ఞలను ధిక్కరించి, ఆయనకు విరోధముగా పాపము చేసిరి.

గనుక, యెహోవా ఈ లోక సంబంధమైన రాజులు పట్ల విసుగు చెంది "దావీదుతో చేయబడిన వాగ్దానము నేరవేర్చుటకే తన ప్రజలను  ఏలుబడి చేయుటకు, తన యొద్ద ఉన్న వాక్యమును(యేసుక్రీస్తు) దేవుని కుమారునిగా ఈ లోకములో పుట్టించెను." - (2 సమూయేలు. 7:12-16; యిర్మీయా. 23:5; లూకా. 1:32; యోహాను. 3:16).

■ దేవుని రాజ్య భారమును నిత్యము మోయుటకై తండ్రి వారు యేసును దేవుని కుమారునిగా పుట్టించెను. - (యెషయా. 9:6).

గమనిక:- తన కుమారుడు ఏలుబడి చేయుటకు నియమించిన రాజ్యము లోక సబంధమైనది కాదు. (యోహాను. 18:36).

■ తన ప్రజలు వారి పాపములు కొరకు యేసు మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచిన పిమ్మట (1 కొరింది. 15:3-4) తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). మహా దేవుడు కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).

■ తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తన కుమారుని ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3; 9).

■ అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి తన ప్రజలను ఏలుబడి చేయుటకు తనను "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. (లూకా.1:32; అపో.కార్య. 2:32-36).

■  అతని సింహాసనము "సూర్యుడున్నంతకాలము" నా సన్నిధిని ఉండుననియు.. "చంద్రుడున్నంతకాలము" అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు. - (కీర్తన. 88:35-36).


"దేవుని కుమారుని రాజ్యములో పాలు పొందుటకు మనము ఏమి చేయవలెను?".

● మనము "సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని" తన కుమారుని విశ్వసించాలి. (మత్తయి. 16:16).
● ఈయన తన ప్రజలను ఏలుబడి చేయుటకు వచ్చిన దేవుని కుమారునిగా గుర్తించాలి. (యోహాను. 1:49).
● బాప్తీస్మము పొంద గోరువారు "యేసు దేవుని కుమారునిగా అనగా నా రాజని, నన్ను శాస్వతమైన సింహాసనము  మీద కూర్చొని నన్ను ఏలుబడి చేయువాడని విశ్వసిస్తే, తన రాజ్యములోనికి చేర్చబడుతాడు. (అపొ.కార్య. 8:36; రోమా. 10:39; అపొ.కార్య. 2:38-40;47).
● దేవుని కుమారునియందలి అనగా అయన ఏలుబడి యందు ఉంటు విశ్వాసము వలన జీవించవలెను. (గలతి. 2:20).
● యేసు దేవుని కుమారుడని ప్రకటించవలెను. (అపో.కార్య. 9:20).
● యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన యెడల జీవము పొందుకోగలము. (యోహాను. 20:31).
● యేసు దేవుని కుమారుడుగా నమ్మే వాడు తన హృదయములో యేసును ప్రతిష్టంచుకొని (1పేతురు. 3:15), తన ఏలుబడిలో ఉంటూ, ఇక మీదట జీవించువాడిని నేను కాదు ఆయనే అనే ఆలోచన గలిగిన వారుకి మాత్రమే యేసు వారు దేవుని కుమారునిగా ఉంటారు.
● మనలో "దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములో ఏకత్వము పొందాలి అనుకుంటే అపొస్తలుల బోధ వలన మాత్రమే సాధ్యము. (యోహాను. 17:20-22)


1యోహాను 2: 22
యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.

"మనోహర్ బాబు గుడివాడ" ©

సత్య అన్వేషకులు చేత అపార్ధము చేయబడుతున్న "(John 14:6-11)"Miss understanding by the Truth Seekers

సత్య అన్వేషకులు చేత అపార్ధము చేయబడుతున్న (యోహాను. 14:6-11 వచనములు)

సహోదరీ,సహోదరులందరికీ  మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

యోహాను 14: 6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

సమస్త మానవ జాతి తండ్రి యొద్దకు చేరుటకు యేసు వారు మార్గము, సత్యము, జీవము అని బాగుగా తెలియాలి. యేసు ద్వారానే తప్ప మరి ఏ ఒక్కరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు.

తండ్రి ఎక్కడ ఉన్నారు .? 

● "పరలోకమందున్న మా తండ్రి" - (మత్తయి. 6:9).
● "సర్వాంతర్యామి అనగా అన్ని చోట్ల ఉన్నవారు" - (కీర్తన. 139:7-10).

◆ "నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు". -(ద్వితి.కాం. 10: 17).

యెహోవా ఎవరుకి తండ్రి..? 

● "మీ తండ్రి" - (మత్తయి. 5:48 7:11).
● "నీ తండ్రి" - (మత్తయి. 6:4,6,18).
● "నా తండ్రి" (యేసువారికి కూడా తండ్రి) - (మత్తయి. 7:21; 10:32).
● "మనకు తండ్రి" - (1 కోరింథీ. 8:6)

ఈ వాక్య ఆధారములు చూసాక తండ్రి వారు యేసు రూపములో వచ్చారు అని అపార్ధము చేసుకొనవసరం లేదు.


యోహాను 14: 7-9
మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.

అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా

యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?


ఈ వచనములులో యేసు వారు మూడు సార్లు "ఎరుగుట" గూర్చి మాట్లాడటం జరిగింది.

ఎరుగుట అనగా తెలుసుకొనుట, గ్రహించుకొనుట

యేసును గూర్చి ఏమి తెలుసుకోవాలి..?


● " తన ప్రజలను వారి పాపములనుండి రక్షించుటకు యేసు పుట్టారు" అని- (మత్తయి. 1:21)
● "యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు" అని - (మత్తయి. 16:16).
● "మన యెడల ఉండే తండ్రి యొక్క చిత్తము జరిగిoచుటకును, తండ్రి రొమ్మున నుండి యేసు ఈ లోకమునకు పంపబడినవాడు, మన మధ్యకి వచ్చి తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణముగా నేరవేర్చాడు" అని - (యోహాను. 5:24,36-38, 17:4).
● "లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" అని - (1 కోరింథీ. 15: 3).
"తండ్రి యొద్ద నుండి ఈ లోకమునకు వచ్చి మరల ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్లారు" అని - (యోహాను. 1:18; 16:26-27; 6:57; అపొ.కార్య. 2:32-36).

యేసు ఎవరు అనేది నిజముగా ఎరిగి ఉంటే యేసును మన కొరకు పంపిన ఆ ఒక్క తండ్రిని కూడా క్రీస్తు బలి ద్వారానే వారు(తండ్రి + కుమారుడు) ఇరుగురు అని తెలుసుకొనే స్థితి కలుగుతాది.


యోహాను 14: 8-10
అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా

యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?

తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.


ఈ మూడు వచనములలో "పిలిప్పునకు మరియు యేసుకి మధ్య సంభాషణ".

"పిలిప్పు భౌతికముగా ఆలోచన చేసి తండ్రిని చూడాలి అని ఉంది అని యేసును అడిగినట్టుగా చూడగలము. దీన్ని బట్టి పిలిప్పు ఆయనను సరియైన రీతిలో తెలుసుకోలేకపోవడమే".

"నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు" - (యోహాను. 14:9).

ఈ వచనము పట్టుకొని నీవు ఇలా అనుకోవచ్చు తండ్రియే మన మధ్యకి యేసు వలె వచ్చారని ఆలోచన ఉంటే ఈ క్రింది వచనములు విషయములో నీవు సత్యము ముందు మౌనము వహించవలసిన అవసరము కలుగును.

యోహాను 1: 18
"ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు".
యోహాను 6: 47
"దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్నవాడు".
 ◆ 1యోహాను 4: 12
"ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు".


నన్ను చూచినవాడు అనగా యేసు ఎందుకొరకు వచ్చారో, ఏమి ప్రకటన చేసారో, ఎందుకు మరణించారో, ఎందుకు తిరిగి లేచారో అని పరిశీలన చేయువాడే తండ్రి యొక్క మనస్సు, ప్రేమ, మన యెడల చిత్తమును జరిగించు యేసు ద్వారా తండ్రిని చూచువాడు అని అర్ధము."


● యేసు వారు "తండ్రి యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను". - (యోహాను 8:26)

ఈ విషయాలను కొందరు ఎరుగకపోవడము వలననే తండ్రి వారు యేసు అని వాక్యమును అపార్ధము చేసుకొనుచున్నారు.


యోహాను 14: 11
తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.

అవును...

◆ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది -
(కొలొస్స 1:19).
◆ యేసు దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, - (హెబ్రీ 1: 3).

Note:- ఈ వచనములోనే కాదు బైబిల్ అంతటిలో యేసు వారు ఎక్కడ  కూడా "నేను తండ్రిని అని" చెప్పుకోలేదు.

● యేసు మన మధ్యకు రక్షకుడుగా మరియు దేవుని కుమారుడుగా పుట్టి (మత్తయి 1:21; యోహాను. 3:16) దాసుని స్వరూపము ధరించి (ఫిలిప్పీ. 2: 6) సమస్త జనులు పాపములు కొరకు అక్రమకారులు చేత సిలువ వేయబడి, సమాధి చేయబడి, మూడవ దినమున తండ్రిచేత లేపబడెను.  (లూకా. 24:47; అపొ.కార్య 2:23-24,32; 1 కొరింథీ 15:3-4; 1పేతురు. 2:24).

●అటు పిమ్మట, పరలోకమును ఆరోహణమయ్యి, యేసు వారు తండ్రి కుడిపార్శ్వమున హెచ్చింపబడి "తండ్రి చేత ప్రభువుగాను, క్రీస్తుగాను నియమింపబడ్డారు". (అపొ.కార్య. 1:9; 2:33, 35-36)

కాబట్టి నా ప్రియులరా... ఇకనైనా ఆలస్యము చేయక వాక్య పరిశీలన చేసి, ఈ దినమే వారు (తండ్రి + కుమారుడు) ఇరుగురు అనే గొప్ప సత్యమును అంగీకరించుము.



యోహాను 17: 3
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును 
నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే.
(నిత్య జీవము).

మనోహర్ బాబు గుడివాడ ©

"మూడు రాత్రులు - మూడు పగలు" (Three Days & Three Nights)

అంశము : "మూడు రాత్రులు - మూడు పగలు".


నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.


నా ప్రియులారా, ఈ అంశము గూర్చి పరిశీలన చేసే ముందుగా మొదట ముఖ్యముగా ఈ క్రింది వాటి గూర్చి బాగుగా తెలియాలి. అదేమనగా,

యూదులు కాలమాన ప్రకారముగా "మొదట రాత్రి, తరువాత పగలు" వస్తాయి.
"06:00p.m. TO 06:00a.m. మరియు "06:00a.m TO 06:00p.m"

★  "ఒక్క రోజు" - [ 06:00p.m to 06:00p.m ] - (లేవి.కాండము." 23:32.)


■ "విశ్రాంతి దినము మరుసటి దినము" - "ఆదివారము".
■ "విశ్రాంతి దినము" - "శనివారము".

● "విశ్రాంతి దినము గడిచిపోయిన..." - "ఆదివారము" - (మత్తయి 28:1).
● "విశ్రాంతిదినము గడచిపోగానే"... - ఆదివారము - (మార్కు 16: 1).

● "సిద్ధపరుచు దినమునకు మరుసటి దినము" - " శుక్రవారము" - "పులియని రొట్టెలు పండుగ" - (మత్తయి 27:62; లేవి.కాండము 23:6)
● "సిద్ధపరుచు దినము" - "గురువారము" -(లుకా 23:54; మార్కు 14:12-14).


● "పస్కా పండుగను" ఆచరిoచినది మరియు సిద్ధపరిచినది - "గురువారము" - (లుకా 22:7;13; లేవి.కాండము 23:5).


  "మూడు రాత్రులు - మూడు పగలు యొక్క వివరణ"


"గురువారము రాత్రి" :
*సాయంకాలమైనప్పుడు యేసు తన పండ్రెండుమంది శిష్యులతో కూడ  "పస్కా భోజనము" ఆచరించెను. - (మత్తయి 26:20-25;  మార్కు 14:17-21; లూకా 22:14-15).

 *ఆ రాత్రి యేసు వారు అపొస్తలులతో కలసి "ప్రభువు బల్లను" ఆచరించెను - (మత్తయి 26:26-29; మార్కు 14:22-25; లూకా 22:16-21).
*ఆ రాత్రి ఇస్కరియోతు యూదా చేతనే ప్రధానయాజకులకి యేసు వారు అప్పగింపబడ్డారు - (మత్తయి 26:31-75; మార్కు 14:32-72; లూకా 22:39-62).


"గురువారము పగలు" :
*యేసును పొంతిపిలాతునకు అప్పగించిరి - (మత్తయి 27:1-2; మార్కు 15:1-2; లుకా 23:1-2).

* పొంతిపిలాతు నుండి హేరోదు దగ్గరకు పంపుట మరియు  పిలాతునొద్దకు మరల పంపుట - (లుకా 23:6-12).

*ప్రధానయజకులును, పెద్దలును- బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించమని 'లేదా' సిలువవేయుమని జనులను ప్రేరేపించిరి - (మత్తయి 27:20-24; మార్కు 15:9-15; లూకా 23:18-25).

*యేసును సిలువవేసినప్పుడు "పగలు తొమ్మిది" గంటలాయెను. - (మార్కు 15:25).

* "మధ్యాహ్నము  మూడు గంటలు" సమయములో "యేసు బిగ్గరగా కేకవేసి మ్రాను మీద ప్రాణము విడిచెను"  - (మత్తయి 27:45-50; మార్కు 15:33-37; లూకా 23:44-46; యోహాను 19:30).


గమనిక:

ద్వితియోపదేశకాండము 21:21-23
అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.

** మ్రాను మీద వ్రేలాడదీయ బడినవారుని ఆ దినమున వానిని పాతిపెట్టాలి. గురువారము పగలు సాయంత్రము 6 కి సమాప్తి అవుతాది. యేసును 6 లోపు సమాధి చేయాలి **

*యేసును -తొలిచిన రాతి సమాధిలో ఉంచెను - (మత్తయి27:57-60; మార్కు 15:43-46; లూకా 23:50-53; యోహాను 19:38-42).


❣ నోట్ ❣
∆ గురువారము  పగలు అనగా శుక్రవారం రాత్రి రాకుండా ఆరు గంటలు లోపు సమాధి చేసారు కావున ఇది ఒక పగలుగా తీసుకోవాలి. 


"శుక్రవారము రాత్రి + పగలు" :

*"సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి.." - (లూకా 23:56).

*పస్కా సిద్ధపరుచుటకు మరుసటి రోజున కావలి వారు రాతికి ముద్రవేసి, సమాధిని భద్రముచేసిరి. - (మత్తయి 27:62-66).


❣ నోట్ ❣
∆ శుక్రవారము రాత్రి + పగలు = "ఒక దినము".


"శనివారము రాత్రి + పగలు" :

*ఈ దినము విశ్రాంతి దినము - (నిర్గమ. కాండము 31:12-16; లేవి.కాండము 23:3).

*ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి. - (లూకా 23:56).


❣ నోట్ ❣
 శనివారము రాత్రి + పగలు = "ఒక దినము".


"ఆదివారము రాత్రి" :

* "విశ్రాంతి దినము గడిచిపోయిన..." - "ఆదివారము" - (మత్తయి 28:1).
* "విశ్రాంతిదినము గడచిపోగానే"... - ఆదివారము - (మార్కు 16: 1).
* "ఆదివారమున తెల్లవారుచుండగా..." - ( లూకా 24:1).
* "ఆదివారమున పెందలకడ ..." - (యోహాను 20:1).

∆ ఆదివారము సాయంకాలమున శిష్యులు మధ్యకి యేసు వచ్చెను - (యోహాను 20:19).

∆ ఆ దినమందే అనగా ఆదివారమున ఎమ్మాయు అను గ్రామములో ఇద్దరు మనుషులు (ఒకడు క్లెయొపా) యేసుతో సంభాషణ మరియు "ఆదివారమునకి (నేటికి) మూడు దినములాయెను" - (లూకా 24:13-21).


❣ నోట్ ❣
 ఆదివారము రాత్రి

** గురువారము పగలు + ఆదివారము రాత్రి = ఒక దినము **

మనోహర్_నవీన 
మత్తయి 12: 40 
యోనా "మూడు రాత్రింబగళ్లు" తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు
"మూడు రాత్రింబగళ్లు" భూగర్బములో ఉండెను.

Download PDF File

"క్రీస్తు దేవుని కుమారుడా"...?

"క్రీస్తు దేవుని కుమారుడా"...?


💌  అంశము: "క్రీస్తు దేవుని కుమారుడా"...?

అవును

 📢 "దేవదూత సాక్ష్యము" - (లూకా 1:32;35; లూకా 2:10-11 మత్తయి 1:21;25)
 📢 "తండ్రినైన దేవుడు సాక్ష్యము" - (కీర్తన 2:7; యెషయ 42:1; మత్తయి 3:17; యెహోను 5:37; యెహోను 12:28-30; మత్తయి 12:18; 17:5; మార్క్ 1:11; 9:7;  లూకా 9:35; కొలస్సి 1:13; 2 పేతురు 1:17; హీబ్రూ 1:5...etc)
 📢 "శిష్యులు సాక్ష్యము" - (మత్తయి 16:16; 14:33; యెహోను 6:69; 1:29; 1:41; 11:27; 20:31; మార్క్ 8:29; లూకా 9:20; అపో.కార్య 9:20; అపో 2:36-38; )
📢 "దెయ్యాలు సాక్ష్యము" - (లూకా 4:34-41; మార్క 1:34; 3:11; మత్తయి 8:29; యాకోబు 2:19)
📢 "పిలాతు సాక్ష్యము" - (యెహోను 18:37-38)
📢  "శతాధిపతి సాక్ష్యము" - ( మత్తయి 8:5; మార్క్ 15:39; లూకా23:47)

* క్రీస్తు సంఘము రోమా 16:16 *

👀  "హెచరిక" :
యేసు "సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు" అని గ్రహి౦చుము -  (మతాయి 16:16).

తండ్రి + కుమారుడు = ఇద్దరు (కొందఱు యొక్క సాక్ష్యము).

 అంశము:: తండ్రి + కుమారుడు = ఇద్దరు (కొందఱు యొక్క సాక్ష్యము).


నా సహోదరులారా, మీ అందరుకి మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు నామములో నా వందనములు.

మొదటి సాక్ష్యము - "యేసు బాప్తిస్మము పొందిన తరువాత తండ్రినైనా దేవుడు తన కుమారుడును గూర్చి సాక్ష్యము ఇచ్చుట".

మత్తయి 3: 17
ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
● "నా ప్రియ కుమారుడు" -- యేసుక్రీస్తు.
● "ఆకాశము నుండి కలిగిన శబ్దము" -- యెహోవా.

రెండో సాక్ష్యము -  సేన అనే వ్వక్తిలో ఉండే దెయ్యము యొక్క సాక్ష్యము.

మార్కు 5: 7
#యేసూ, సర్వోన్నతుడైన #దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని #దేవునిపేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.

●"దేవుని కుమారుడు" -- "యేసుక్రీస్తు"
 ●"దేవుడు" -- "యెహోవా"

మూడో సాక్ష్యము - "సిలువ మీద ప్రాణము విడిచె ముందు యేసు వారు చివరిగా పలికిన మాట".

 లూకా 23: 46
యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రీ, నీ చేతికి నాఆత్మనుఅప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

 ● తండ్రి -- యెహోవా (దేవుడు).
 ● నా ఆత్మ అప్పగించుకొనుచున్నా -- యేసుక్రీస్తు (ప్రభువు).

నాలుగో సాక్ష్యము - "యేసుక్రీస్తు వారు యొక్క సాక్ష్యము"

యేసు వారు ఎక్కడ ఈ లోకమునకు వచ్చారో, మరల ఈ లోకమును విడిచి ఎక్కడకి వెల్లుచున్నాను అనేది అయన యొక్క శిష్యులుకి ముందుగా తెలియజేయుట.

యోహాను 16: 28
నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకువెళ్లుచున్నానని వారితో చెప్పెను.

 "నేను" -- "యేసుక్రీస్తు".
 "తండ్రి యొద్ద నుండి/యొద్దకు" -- "యెహోవా".

ఐదో సాక్ష్యము - "సిలువ వేయబడిన యేసును ఎవరు లేపారు అనే విషయమును మనకి మొదటి శతాబ్దాపు అపోస్తలలు సాక్ష్యమిస్తున్నారు".

 అపో.కార్యములు 2: 32
ఈ యేసును దేవుడు లేపెను; దీనికి(లేక, ఈయనకు) మేమందరము సాక్షులము.

● "యేసు" -- "దేవుని కుమారుడు".
 "దేవుడు" -- "యెహోవా".

ఆరో సాక్ష్యము -  మనకి ప్రభువు ఎవరు!? మనకి దేవుడు ఎవరు?

దేవుని ఆత్మ ప్రేరణ ద్వార తెలియపరిచిన పౌల్ గారు యొక్క సాక్ష్యము.

1కోరింథీయులకు 8: 6
మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

● మనకు దేవుడు ఒక్కడే -- తండ్రి (యెహోవా).
 మనకు ప్రభువు ఒక్కడే -- దేవుని కుమారుడు (యేసుక్రీస్తు).


సాతాను బోధ 

A). తండ్రినైనా దేవుడు వారు శరీరదారియే యేసుక్రీస్తు వారులా వచ్చారు -- (వాక్యము లేదు).
B). తండ్రి మన కొరకు సిలువ వేయబడ్డారు -- (వాక్యము లేదు).
C). తండ్రి - యేసుక్రీస్తు - (వాక్యము లేదు).
D). తండ్రి వారు క్రీస్తులా వచ్చి మనకి మాదిరి చూపారు -- (వాక్యము లేదు)...etc


ప్రియులారా.... ఇటువంటి సాతాను మాటలు చెపుతూ మిమ్మలి ఎవరు మోసము చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి.

 1యోహాను 2: 22
"తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి".


నేటి క్రైస్తవ్యములో కొందరూ బోధకులు సాతానుకు లోబడి అనేక మందికి వాడి ప్రవేశపెట్టిన బోధలును ప్రకటన చేయిస్తూ, ప్రపంచములో అసత్యమును ఎదుగుటకు సహాయకులుగా వినియోగపరచుకుంటున్నాడు. జాగ్రత్త సుమా!!! #వందనములు.
మనోహర్.
క్రీస్తు సంఘము - (రోమా 16:16).
The churches of Christ greet you - Roma 16:16