Showing posts with label ఆదివారము. Show all posts
Showing posts with label ఆదివారము. Show all posts

"పస్కా పండుగ" (The Passover)

పస్కా పండుగ

క్రైస్తవులని పిలువబడుతున్న వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి కాలములో అనేకమంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంధములో లేని అనేక పండుగలను ఆచరిస్తున్నారు. వారు ఆచరిస్తున్న పండుగలలో పస్కా పండుగ ఒకటి. ఈ పస్కా పండుగను చాలా మంది “ క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుటకై చేస్తున్నామని “ చెప్తున్నారు. చాలామందికి లేఖనాలపై సరియైన అవగాహన లేక ఈ పండుగను చేస్తున్నారు, మరి కొంతమంది అందరు చేస్తున్నారు కనుక మేము చేయాలి అనే భావనతో చేస్తున్నారు, ఇంకొంతమంది క్రీస్తు మరణమును తలంచుకోవటానికి చేస్తున్నారు.

వాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “ఈ పండుగను ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? ఎందుకు చేసారు? ఈ పండుగ ఉద్దేశ్యము ఏమిటి? ఈ పండుగను చేయమని ఆనాడు వారికి దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? నేటి క్రైస్తవులమైన మనము చేయవచ్చా? పస్కాను చేయమని నేటి క్రైస్తవులమైన మనకు దేవుడు ఆజ్ఞాపించాడా?”. ఇలాంటి కొన్ని విశేషమైన సంగతులను లేఖనానుసారముగా ఆలోచన చేద్దాము. తప్పును సరిదిద్దుకుందాము.

ఎవరు చేసారు?


ఈ పండుగను ఇశ్రాయేలీయులు (లేదా) యోకోబు సంతానమైన పన్నెండు గోత్రముల వారు మాత్రమే చేసినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మోషే ఇశ్రాయేలీయుల ”  పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెనుమీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి. (నిర్గమ. 12:21).

 » “ ఇశ్రాయేలీయులు ” పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:2).

 » “ ఇశ్రాయేలీయులు ” గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి. (యెహోషువా. 5:10).

ఎప్పుడు చేసారు?


 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను.(ద్వితియో. 16:1).

 » మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ ముతోఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. (నిర్గమా. 12:1-3).

 » దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:3, యెహోషువా. 5:10).

 » మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. (లేవీ.కాం. 23:5).

ఎందుకు చేసారు?


 » యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను. మరియు మీకుమారులుమీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కా రముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. (నిర్గమ. 12:25-28).

 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱ మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను. – (ద్వితియో. 16:1-2).


పస్కా పండుగ ఉద్దేశ్యము ఏమిటి? మరియు దేవుడు వారిని ఎందుకు పస్కాను చేయమన్నాడు?


దేవుడైన యెహోవా, ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను ఫరో అధికారము నుండి తప్పించి, అన్యుల ఎదుట అనేక ఆశ్చర్య కార్యములను జరిగించి, వారిని కనాను దేశమునకు రప్పించే మార్గములో ఎన్నో అద్భుత కార్యములను చేసి, వారిని సంరక్షించిన విధానమును ఇశ్రాయేలీయులు తెలుసుకొని, ఆ మహా గొప్ప అద్భుత కార్యములను జ్ఞాపకము చేసుకొని, దేవుడైన యెహోవాను ఘనపరచాలని ఉద్దేశ్యంతో ఈ పస్కా పండుగను ఆచరించమని వారికి ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు. మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. – (నిర్గమ. 12:26-27).

 » నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగు ప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. (ద్వితియో. 16:10-12).

 » మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసినదేదియు తినవద్దు. ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయు లకు నివాస స్థానమైయుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. (నిర్గమ. 13:3-5).

ప్రియ సహోదరీ, సహోదరుడా, పైన తెలుపబడిన లేఖనములను పరిశీలన చేస్తే పస్కా పండుగ ముఖ్య ఉద్దేశ్యము, ఎవరు చేసారు, ఎందుకు చేసారు, ఎప్పుడు చేసారు, అనే ప్రశ్నలకు చాలా తేటగా సమాధానము తెలిసినది.
దేవుడైన యెహోవా చెప్పిన రీతిగానే ఇశ్రాయేలీయులు పస్కా పండుగను జరుపుకున్నారు, యెహోవా చెప్పిన రీతిగానే చాలా పరిశుద్ధంగా ఆచరించారు.

నేటి క్రైస్తవులు పస్కా పండుగను ఆచరించవచ్చా ?  


వాస్తవానికి ఈ పండుగను చేయడానికి నేటి క్రైస్తవులకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికీ లేఖనాలపై పూర్తి స్థాయి అవగాహన లేక ఈ పండుగను చేయాలనే భావనలో ఉన్నారు. కాని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది..,

 » మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. – (గలతీ. 4:10-12).

 » అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. (కొలస్సి. 2:16).

ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన సిలువ మరణానికి ముందు శిష్యులతో కలిసి పస్కాను భుజిస్తూ, ప్రభువు బల్లను కూడా పరిచయము చేయుట  మత్తయి 26, మార్కు 14, లూకా 22 వ అధ్యాయాలలో చూడగలము. ఆ విషయమును అపోస్తలుడైన పౌలు గారు కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘపు వారిని హెచ్చరిస్తూ (1 కొరింధి 11 వ అధ్యాయము) మన ప్రభువైన యేసు  తిరుగు వచ్చు పర్యంతరము దీనిని (ప్రభువుబల్ల) చేయుడని చెప్పెను. కాని ఎప్పుడు ? సంవత్సరమునకు ఒక్కసారా?

★ “ఆదివారమున” మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. (అపొ.కార్య. 20:7).

ఆదివారము సంవత్సరానికి ఒక్కసారి వస్తుందా? ఆలోచన చేయండి. సంవత్సరమునకు ఒక్కసారే చేయుడి అని ధర్మశాస్త్ర కాలములో వారికి ఆజ్ఞ ఇవ్వబడింది అది కూడా విశ్రాంతి దినము మరుసటి రోజు. మరి నేటి క్రైస్తవులలో శుక్రవారము చేయడము ఆశ్చర్యంగా ఉంది.

1 కొరింధి 5వ అధ్యాయము 7, 8 వచనములు :


★ మీరు పులిపిండి లేనివారు గనుక కొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియనిరొట్టెతో పండుగ ఆచరింతము. – (1 కొరింధి 5:7-8).

ఈ వచనమును ఆధారముగా తీసుకుని చాలామంది పస్కా చేయవచ్చు అని అనుకుంటున్నారు.
అపోస్తలుడైన పౌలు గారు కొరింధ లో ఉన్న సంఘము యొక్క పరిస్థితిని చూసి, మీలో అనేకమంది జారత్వములు కలిగి ఉన్నారు (1 కొరింధి. 5:1), దేవుని విరోధముగా నడుచుకుంటున్నారు, అని వారిని హెచ్చరిస్తూ జారత్వములు చేసేవారిని పాపములు చేసేవారిని పులిసిన పిండితో పోలుస్తూ , క్రైస్తవులమైన మనకు ఇది తగదు. మనము ఈ లోకము నుండి వేరు చేయబడియున్నాము, మన పాపముల నిమిత్తము క్రీస్తు వధింపబడ్డాడు కనుక  మనము పులిపిండి లేని వారముగా ఉండి, నిష్కాపట్యముతోను, సత్యముతోను” పులియని రొట్టెతో పండుగ ఆచరింతము  అని చెప్పి అక్కడి సహోదరులను బలపరచడం జరిగింది.

ప్రియులారా నేటి క్రైస్తవులమైన మనకు భౌతిక సంబంధమైన పండుగలు ఆచరణలో లేవు.  క్రీస్తు లోనికి బాప్తీస్మము పొందిన మనము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని, ఆ ప్రభువు బల్లలో పాలు పొందుట అనేది మనకివ్వబడిన ఆజ్ఞ. అది నెలకొకసారి, సంవత్సరానికొకసారి చేసేది కాదు ప్రతి ఆదివారము చేసేది కనుక క్రైస్తవులమైన మనకు ప్రతి ఆదివారము ఒక పండుగ దినమే కాని అది “భౌతిక సంబంధమైన పండుగ కాదు ఆత్మ సంబంధమైన పండుగ”.  

ధర్మశాస్త్ర కాలములో మన పితరులు చేసినది భౌతిక సంబంధమైనది కాని ఆత్మ సంబంధమైనది కాదు. ఆనాడు మన పితరులు ఆచరించిన ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక (హెబ్రీ. 7:18) వారు పండుగలను, ఆచరించినను, పస్కాను భుజించినను అరణ్యములో కూలిపోయిరి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆ ఆజ్ఞలను పూర్తి స్థాయిలో పాటించక వారందరును నశించిరి.

మరి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ధర్మశాస్త్రములో గల పండుగలను చేయమనా?
ఆయన కుమారుడైన క్రీస్తు మరణమును లోకములో ప్రచురము చేసి నీ ప్రవర్తన ద్వారా అనేకులను సంఘమునకు నడిపించి, ప్రతి ఆదివారము సంఘముగా కూడి పవిత్రంగా, పరిశుద్ధంగా తండ్రిని ఆరాధించి, ప్రతి ఆదివారము ఆయన కుమారుడైన క్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుచూ అనగా ప్రభువు బల్లలో పాలు పొందుచూ, అపోస్తులుల బోధలో నిలకడగా ఉండి,  మరణము వరకు నమ్మకముగా ఉండడమే కదా తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ. ఆలోచన చేయు. ప్రవర్తన సరిదిద్దుకో. క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె ఈ యుగ సంబంధమైన దేవతతో పోరాడు.....

● ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా, ధర్మశాస్త్రగ్రంధమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే.(గలతీ. 3:10-11).

● ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవునియెదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్నవాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. (రోమా. 3:19-20).


మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

"ప్రభురాత్రి భోజనము" (Lord's Supper)


"ప్రభురాత్రి భోజనము"


పరిశుద్ధులుగా  ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

 ప్రియులారా, నేటి సమాజములో అనేకమంది క్రైస్తవులు ప్రభురాత్రి భోజన విషయంలో వివిధ ఆలోచనలు, పద్దతులు కలిగియున్నారు. కొన్ని సంఘాల వారు ప్రభురాత్రి భోజనమును నెలకొకసారి తీసుకోవాలని, మరికొందరు సంవత్సరానికొకసారి తీసుకోవాలని, ఇంకొంతమంది క్రిస్టమస్ పండుగరోజు తీసుకోవాలని, పాప క్షమాపణ కలుగుటకు ప్రభువు బల్లలో చేయి పెట్టాలని సొంత అభిప్రాయాలు కలిగి 1 కొరింధి 11వ అధ్యాయము 23 నుండి 34 వచనములను సరిగ్గా అర్థము చేసుకోలేకపోతున్నారు.

ఈ ప్రభురాత్రి భోజనము అంశము ద్వారా పైన చెప్పబడిన విషయములను మరియు కొన్ని అతి ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి  పరిశుద్ధ గ్రంధమును పరిశీలన చేసి అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము.

★ "ప్రభురాత్రి భోజనము" అనగా రాజ్య సంబంధమైన భోజనము. రాజ వంశీకులకు మాత్రమే అనుగ్రహింపబడినది ఇంకా చెప్పుకోవాలంటే రాజు యొక్క సముఖములో ఆయనతో కలిసి పాలు పంచుకొనుటకు అర్హత కలిగిన భోజనము లేదా రాజుతో మరియు సంఘముతో  సహవాసము కలిగిన భోజనము.

ఉదాహరణకు :-

1) ఏ మాత్రము అర్హత లేని మెఫీబోషేతుకు రాజైన దావీదు సముఖములో భోజనము చేయుటకు కలిగిన అవకాశము.

 » అందుకు దావీదునీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా. అతడు నమస్క రించిచచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను. – (2 సమూయేలు. 9:7-8).


2) షేబదేశపు రాణి రాజైన సొలోమోను భోజన బల్లను చూసి ఆశర్యపడుట.

 » షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై. – (1 రాజులు. 10:4-5).


ఇటువంటి  గొప్ప రాజ విందులో పాలు పొందుటకు ఎటువంటి అర్హత లేని మనకు తండ్రియైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సహవాసమును ఏర్పాటు చేసి (1 కొరింధి. 1:9), తన కుమారుని రాజ్యములో వారసులునుగా చేసి (1 పేతురు. 2:9), ఆ రాజు యొక్క విందులో అనగా ప్రభురాత్రి భోజనములో చేయి పెట్టుటకు అవకాశమును దయచేసెను (1 కొరింధి. 11:23-32). కాని ప్రియ సహోదరుడా, పైన పేర్కొనబడిన రాజ విందులో పాలు పంచుకొనుట నామమాత్రమే గానీ క్రీస్తువారి ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రాజ విందు శాశ్వతమైనది, నిత్యమూ క్రమము తప్పకుండా కొనసాగించేదని క్రైస్తవులమైన మనము మొదట గ్రహించాలి.


NOTE:- మన ప్రభువైన యేసుక్రీస్తువారు తాను అప్పగింపబడిన రాత్రి తన శిష్యులతో కలిసి రెండు రకాల భోజనాలలో పాలు పొందుట మనము చూడగలము. 

● ఒకటి పస్కా భోజనము,
● రెండవది ప్రభురాత్రి భోజనము.

 » వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – (మత్తయి. 26:26-27).

 » వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – (మార్కు. 14:22-23).


ప్రభురాత్రి భోజనము ఎప్పుడు తీసుకోవాలి..?

ఈ ప్రభురాత్రి భోజనమును ఒక్కొక్క సంఘము ఒక్కోరోజు తీసుకుంటుంది. కాని ఆదిమ అపొస్తలులు "ప్రతి ఆదివారము" తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంధములో స్పష్టముగా కనబడుచున్నది..

 » "ఆదివారమున" మేము రొట్టె విరుచుటకు కూడినపుడు. - (అపొ.కార్య. 20:7).

ప్రియులారా, ఆదివారము నెలకొకసారి వస్తుందా లేక సంవత్సరానికొకసారి వస్తుందా లేదా వారమునకు ఒకసారి వస్తుందా నేటి క్రైస్తవులు గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది.  చాలామంది ఆదివారము సెలవు దినము కాబట్టే ఆరోజు నిర్ణయింపబడిందనే ఆలోచనలో ఉన్నారు కాని ఆదివారమునకు ఉన్న ప్రాముఖ్యతను దేవుని గ్రంధములో చూడగలిగితే,


 » యేసు పునరుత్థానుడై తిరిగి లేపబడిన దినము "ఆదివారము". – (మత్తయి. 28:1; మార్కు. 16:2; లూకా. 24:1; యోహాను. 20:1). 

 » క్రీస్తు సంఘము ప్రారంభమైన దినము "ఆదివారము". – (అపొ.కార్య. 2:38-41).

 » క్రీస్తు వారు పరలోకమునకు కొనిపోబడిన పిమ్మట అపొస్తులులు, ఆదిమ సంఘస్థులు ప్రభురాత్రి భోజనము మొదటిగా తీసుకున్న దినము  "ఆదివారము". – (అపొ.కార్య. 20:7).


గమనిక : ప్రియులారా క్రింద వ్రాయబడిన వచనమును బట్టి కొందరు క్రైస్తవులు అనుదినము రొట్టె విరవాలని తప్పుగా అర్థము చేసుకుంటున్నారు కాని ఇక్కడ వారు చేసిన భోజనము అత్మానుసారమైనది కాదు శరీరమునకు కావలసిన ఆహారమని గ్రహించాలి.   

 » ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్థితించుచు. – (అపొ.కార్య. 2:46).



ప్రభురాత్రి భోజనము ఎవరు తీసుకోవాలి..? 

సహోదరులారా ప్రభురాత్రి భోజనమును ఎవరు పడితే వారు తీసుకునే కార్యక్రమమని పరిశుద్ధ గ్రంథము తెలియజేయట్లేదు. ఈ ఆర్హత కేవలము క్రీస్తు శరీరములోనికి అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) బాప్తీస్మము పొందిన వారికే మాత్రమే అనుగ్రహింపబడిందని తెలుసుకోవాలి.

 » ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫెసీ. 1:23).

 » క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? – (రోమా. 6:3).

 » క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. – (గలతీ. 3:27).

» ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. – (1 కొరింధి. 12:13).


ప్రభురాత్రి భోజనముయొక్క ముఖ్య ఉద్దేశ్యము :

అపొస్తులుడైన పౌలు గారు కొరింధి పట్టణములో  ఉన్న క్రీస్తు సంఘమును హెచ్చరిస్తూ, వారి లోపాలను వారికి గుర్తుచేస్తూ ప్రభువైన క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో కలిసి పుచ్చుకున్న భోజన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్క స్థానిక క్రీస్తు సంఘము ఇట్టిరీతిగానే ఆ క్రీస్తు సహవాస భోజనములో పాలు పొందాలని కొన్ని విశేష సంగతులను తెలియజేయడమైనది.


A). "జ్ఞాపకము" : (1 కొరింధి. 11:23-25).

 » నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి. దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

★ జ్ఞాపకము అనగా స్మృతి, జ్ఞప్తి.

1). సమస్త మానవాళి తమ పాపములు విషయములో పరిహారము పొందాలంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే సాధ్యమని మన తండ్రియైన దేవుడు  ముందుగానే ఎరిగి తాను నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయనను నియమించెనని, ఇప్పుడు ఆయన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమందు మనయెదుట ప్రత్యక్షపరచబడెనని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (అపొ.కార్య. 2:23, 1 పేతురు. 1:18-21).     

2). మన పాపముల నిమిత్తమై మరణించుటకు రక్తమాంసములలో పాలివాడై, ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అపవాదిని నశింపజేసి, మరణభయము నుండి  విడిపించి,  సకల ప్రజల పాపములకు పరిహారము కలుగజేసి, సిలువపై ఎంతో శ్రమ పొంది, తనతో సమాన వారసత్వమును కలుగజేసి, మనలను రక్షించిన  క్రీస్తు మరణ త్యాగమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (హెబ్రీ. 2:14-17). 

3). యేసు తాను చేయని తప్పుకి మనకొరకు ఎన్నో శ్రమలనుభవించి, కొరడాలతో కొట్టబడి, ఎన్నో గాయములనొంది, తనను చెంపమీద కొట్టినా, తనను హేళన  చేసినా,  చివరికి తనపై ఉమ్మివేసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనముగా తండ్రి చిత్తము చొప్పున సిలువ భారమును భరించాడంటే అది కేవలము నీ కోసము నాకోసమే అని గ్రహించి ఆయనను జ్ఞాపకము చేసుకోడానికే ప్రభురాత్రి భోజనమని  తెలుసుకోవాలి. – (యెషయా. 50:6; 53:3-10, మత్తయి. 26:27; 27:26-31, మార్కు. 14:65, యోహాను. 18:22; 19:1, 1 పేతురు. 3:21-24).

4). మనలను ఎలాగైతే అపవాది లోబరుచుకున్నాడో అలాగే, యేసు ఈ లోకములో శరీరధారిగా నివసించినప్పుడు అపవాది చేత ఎన్నో రకాలుగా శోధించిబడినప్పటికీ తాను ఎంతమాత్రము లోబడక అపవాదిని దైర్యముగా ఎదుర్కొని ఈ లోకములో ఉన్నంత కాలము మనకొరకు అపవాదితో మహాయుద్ధము చేసి మనకు జయమును కలుగజేసాడన్న విశేష సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. – (లూకా. 11:21, యోహాను. 1:14; 13:1-17, హెబ్రీ. 2:15).

5). దేవుని స్వరూపము కలిగినవాడైనప్పటికీ, ఆయనతో సమానముగా ఉండే గొప్ప బాగ్యమును విడనాడి, దేవదూతలకంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి, మనుష్య పోలికగా పుట్టి, దాసుని రూపము ధరించుకుని, తనను తాను ఎంతమాత్రము హెచ్చించుకొనక శిష్యుల పాదములను సైతము కడిగి, అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల చేయుటకు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తనను తాను ఎంతగానో తగ్గించుకుని, మనలను బ్రతికించిన ఆ యేసుని హృదయపూర్వకముగా జ్ఞాపకము చేసుకోవాలి. – (ఫిలిప్పి. 2:5-8, ఎఫెసీ. 2:1, హెబ్రీ. 2:9).

6). మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుటకు అనగా ఇహలోక మాలిన్యమును ఎంతమాత్రమును మనకంటకుండా ఆయనను పోలి నడుచుకోవాలని మనకు మాదిరి చూపించిన ఆ యేసుని జ్ఞాపకము చేసుకోవాలి. – (1 పేతురు. 2:21-24, యాకోబు. 1:27).

NOTE: ఇటువంటి ఎన్నో విశేష సంగతులన్నిటిని జ్ఞాపకము చేసుకొని ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందాలి.


B). "యేసు మరణ ప్రచురము" : (1 కొరింధి. 11:26).

» మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

★ ప్రచురము అనగా ప్రకటించుట.

ప్రియులారా,  క్రీస్తులోనికి బాప్తీస్మము పొంది, ఆ ప్రభువు యొక్క బల్లలో పాలుపంచుకునే నీవు మనకు అప్పగింపబడిన సువార్త పనిలో కొనసాగుతున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి.
సిలువను గూర్చిన వార్త మనకు దేవుని శక్తియై ఉన్నదని, నశించువారు రక్షింపబడుటకు క్రీస్తు సువార్తయే మార్గమని ఈ లోకములో ప్రకటన చేయాలి.

» సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. – (1 కొరింధి. 1:18).

1). సిలువను గూర్చిన వార్త ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించారని, సమాధి చేయబడెనని, మూడవ దినమున లేపబడెనని అపోస్తులులు ఎలాగైతే ప్రకటన చేసారో మనము కూడా ఈ లోకములో ప్రకటన చేయాలి.

» సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:1-4).

2). క్రీస్తు ఈ లోకమునకు రాకమునుపు మరణము ప్రతి మనుష్యుని యేలెను కాని ఆ క్రీస్తు రాక ద్వారా మరణము ఓడించి, అపవాదికి అపజయమునిచ్చియున్నాడని, పాతాళపు నోరు కట్టియున్నాడని, సువార్త ద్వారా ఆయనను అంగీకరించువారికి జీవమును, అక్షయతను కలుగుజేయువాడు ఆయన మాత్రమే అని ప్రకటన చేయాలి. 

» క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. – (2 తిమోతి. 1:10).

 జీవము అనగా క్రీస్తునందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకునని,

 అక్షయత అనగా బ్రదికి క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడని ప్రకటన చేయాలి.

» అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. – (యోహాను. 11:25,26).

3). మృతులు అనగా యేసుక్రీస్తు సువార్తకు లోబడనివారు. ఆయన సువార్తకు లోబడనివారికి నీవు తెలియజేయవలసినది ఏమనగా “పాపముల విషయములో చనిపోయిన నీవు క్రీస్తు సువార్త ద్వారానే బ్రతుకుతావని అలా చెప్పుటకు సాక్షిని నేనే అని చెప్తూ, ఆ మృతుడు క్రీస్తు రాజ్యములో (CHURCH OF CHRIST) ప్రవేశించు వరకూ  ఆయన మరణమును గూర్చి ప్రకటన చేయాలి.”

» మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. – (యోహాను. 5:25).


C). "స్వపరీక్ష" : (1 కొరింధి. 11:27-28).

» కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

★ స్వపరీక్ష అనగా తనకు తాను పరీక్షించుకొనుట


మనస్సు మార్పునొంది, దుష్టత్వాన్ని మానుకొని చెడు కార్యములను విడిచి పెట్టుటకు, తన మనసాక్షి నిమిత్తము  తప్పులను సరిచేసుకుని, క్రీస్తులాంటి జీవితమును జీవించాలని ఆలోచన కలిగి హృదయపూర్వకముగా కోరుకునేవారికి ప్రభురాత్రి భోజనము ఒక గొప్ప అవకాశము.

ప్రియ సహోదరుడా,  క్రీస్తువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తనని సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచన ముందుగానే ఎరిగి, మనస్సు మార్చుకునే అవకాశమును ఇవ్వడము జరిగింది కాని యూదా మాత్రము అయోగ్యముగానే క్రీస్తు బల్లలో పాలు పొందాడు, చివరికి క్షమాపణ లేకుండానే మరణించాడు. ఆనాడు యూదాకి ఎలాగైతే అవకాశామునిచ్చాడో  ఈనాడు మనకు కూడా ప్రభురాత్రి భోజనము ద్వారా అవకాశమును కల్పించాడు. అయినప్పటికీ దానిని నీవు ఎంతమాత్రము లెక్క చేయకుండా అయోగ్యముగానే అందులో పాలు పొందితే  ఇస్కరియోతు యూదాలాంటి స్థితిని కొరి కొనితెచ్చుకుంటున్నావేమో అని నిన్ను నీవు పరీక్షించుకుని ఆ బల్లలో పాలుపొందాలని కొరింధి పత్రికలో వ్రాయబడిన మాటల సారాంశమని గ్రహించాలి.


» సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవు చున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. – (మత్తయి. 26:20-25).


D). "వివేచన" : (1 కొరింధి. 11:29).

» ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.

★ వివేచన అనగా ఆలోచించుట లేక గ్రహించుట.

◆ సహోదరులారా, ప్రభురాత్రి భోజనములో భాగంగా రొట్టెను తీసుకునేటప్పుడు అది క్రీస్తు శరీరముకు సాదృశ్యమని, ద్రాక్షారసమును తీసుకునేటప్పుడు అది క్రీస్తు రక్తమునకు సాదృశ్యమనే భావన కలిగియున్నారు కాని వాస్తవానికి రొట్టె క్రీస్తు శరీరముకు, ద్రాక్షారసము ఆయన రక్తముకు చిహ్నమని గ్రహించలేకపోతున్నారు.

◆ నేటి సంఘాలలో చాలామంది ప్రభురాత్రి భోజనము కార్యక్రమము చేస్తున్నపుడు రొట్టెను, ద్రాక్షారసమును పంచిపెడుతూ అవి క్రీస్తు శరీరముకు మరియు రక్తముకు సాదృశ్యముగా చెప్తుంటారు కాని సహోదరుడా ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో సాదృశ్యమనే పదము వాడుట సరియైనది కాదు ఎందుకనగా సాదృశ్యము (figure ) అనగా ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము అని అర్థము వసున్నది. దీనినిబట్టి ఆలోచన చేయగలిగితే రొట్టె క్రీస్తు శరీర ఆకారము కాదు మరియు ద్రాక్షారసము ఆయన రక్తము కాదు కనుక సాదృశ్యమనే భావనతో ఆయన బల్లలో చేయి పెట్టకూడదు.

◆ ప్రభురాత్రి భోజనములో పాలు పొందే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, రొట్టె అనగా సిలువలో నలుగగొట్టబడిన క్రీస్తు శరీరముకు చిహ్నమని, ద్రాక్షారసమనగా ఆయన ఎన్నో గాయములనొంది సిలువలో కార్చిన రక్తముకు చిహ్నమని ఆలోచన కలిగియుండాలి, వివేచనతో ఆ పాత్రలో చేయి పెట్టాలి.  (చిహ్నము అనగా గుర్తు).

◆ క్రీస్తు శరీరము అనగా సంఘము కాని రొట్టె కాదు. అపోస్తలుడైన పౌలుగారు శరీరమంటే సంఘమనే ఉద్దేశముతోనే మాట్లాడటం జరిగిందని గ్రహించాలి. ఎందుకనగా కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘములో వివిధ భావాలు ఏర్పడి కక్ష్యలు, పేద, ధనిక అనే  భేధాలు కలిగియున్నారు కనుక వారిని హెచ్చరిస్తూ ఈలాగు చెప్పెను..

◆ మనమంతా క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) అవయవములుగా చేర్చబడ్డామని, ఆయన శరీరమములో అవయవములన్ని ఏలాగైతే ఒక్కటిగా కలిసియున్నాయో  అలాగే క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము ఏక మనస్సును, ఏక ప్రేమ, ఏక భావము, ఏక తాత్పర్యమును కలిగియుండాలని, ఒకరితో ఒకరు సమాధానము కలిగి దేవునితో సమాధానపరచవలెనని అందుకే క్రీస్తు ఈ లోకములో మరణించాడని వారికి గుర్తుచేస్తూ  ప్రభురాత్రి భోజనము యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయడమైనది. 

 » ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫేసీ. 1:23).

 » కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. – (మత్తయి. 5:22-24).

 » ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. – (ఎఫెసీ. 2:14-17).

 » ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవ ములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. – (1 కొరింధి. 12:12).

కాబట్టి, ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో చేయి పెడుతున్న నీవు నీ సహోదరునితో సమాధానము కలిగియున్నావా?, అన్ని విషయములలో, అన్ని సమయాలలో  క్రీస్తు సంఘముతో ఏకీభవిస్తున్నావా? అని వివేచన కలిగి  ఆ పాత్రలో చేయి పెట్టాలనేది ఆ వచనముల ఉద్దేశమైయున్నది కాని బాప్తీస్మము తీసుకున్నాను కదా అందులో పాలు పంచుకోవాలి కదా అని వివేచన లేకుండా నిన్ను నీవు పరీక్షించుకొనకుండా ఒక ఆచారముగా తీసుకోవాలని సిద్ధపడితే అది శిక్షావిదికే కారకమగును కనుక ఆలోచన చేసి జాగ్రత్తగా ఆయన ఆజన ప్రకారము ప్రభువు బల్ల కార్యక్రమమును నెరవేర్చాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.



మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"బైబిల్ లో ఐదు రకాల ఆరాధనలు"

 

"బైబిల్ లో ఐదు రకాల ఆరాధనలు".


నా సహోదరులారా, మీ అందరుకి మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు నామములో నా వందనములు.

【"బైబిల్ అంతటిలో ఐదు రకాల ఆరాధనలు కనిపిస్తున్నాయి" 】ఆవేమనగా;

❣ "విగ్రహాలుకి ఆరాధన" - (అపో.కార్య 17:23);
❣ "వ్యర్ధమైన ఆరాధన" - (మతాయి 15:9);
❣ "దేవదూత ఆరాధన" - (కొలసి 2:18);
❣ "స్వేచ్ఛ ఆరాధన" - (కొలసి 2:23);
❣ "సత్య ఆరాధన" లేదా "యధార్ధ ఆరాధన" -  (యోహాను 4:24).

A) "అన్యలు" -- "తెలియబడని లేదా విగ్రహాలుకి, దేవదూతా, స్వేచ్ఛా ఆరాధికులు".  (అపో. 17:23; కొలొస్స. 2:18; కొలొస్స. 2:23).

B) "మత శాఖలు" (క్రీస్తు సంఘము కానిది) -- "వ్యర్థ ఆరాధికులు (మత్తయి. 15:9).
మత శాఖలు అనగా "క్రీస్తు రక్తము చేత కడుగబడి (అపో. 20:28) కూడా మనుషులు యొక్క ఆలోచన మేర కట్టబడి, వివిధ నామములుతో పిలువబడిన సంఘములు".

C) "క్రీస్తు సంఘము" -- "ఆత్మతోను, సత్యతోను ఆరాధన చేయు వారు" (యోహాను 4:24; అపో.కార్య 2:41-42; అపో.కార్య 20:7; 1 కోరింది 16:2; ఎపేసి 1:23; కొలస్సి 1:18; రోమా 16:16)

● హెచ్చరిక ●

◆ ప్రియులారా, నీవు "అన్యుడు" (క్రీస్తును అంగీకరి౦చని వారు) అయినచో ఈ దినమే యేసు నీ పాపములు కొరకు ప్రాణము పెట్టుటకు వచ్చారు అని (మతాయి 1:21; లుకా 19:10); అయన యేసు లోకరక్షకుడు అని (యెహోను 4:42); దేవును కుమారుడు అని (మత్తయి 16:16); యేసు మన అందరి పాపములు కొరకు "మరణిచి, సమాధి చేయబడి, మూడోదినము లేచారు" అని(1 కోరింది 15:3-4). క్రీస్తును గుర్చిన మాట విని(రోమా 10:17); యేసు ప్రభువు అని ఒప్పుకొని (రోమా 10:9); మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము(అపో.కార్య 2:38) తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములో బాప్తిస్మము పొంది(మత్తయి 28:19; అపో.కార్య 2:39-40) క్రీస్తు సంఘుముగా చేర్చాబడుటకు మీ హృదయములును త్రిప్పుకొనుడి. ఇకనైన మీ యొక్క "తెలియబడని, దేవదూతా, స్వేచ్ఛా ఆరాధనను విడిచి ఆత్మతోను, సత్యతోను ఆరాధన చేయుటకు (యెహోను 4:24) ఈ దినమే ఆలోచన చేసి నిర్ణయము చేయవలెను అని మిమ్మలి ప్రేమతో కోరుతున్నా..

◆ ప్రియులారా, నీవు ఒక "మత శాఖలుకు" (క్రీస్తు సంఘము కానిది) చెందినా వాడివా అయితే ఈ దినమే ఆ మత శాఖ బట్టి కాక మన అందరి ప్రభువు నామము "సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు" (మత్తయి 16:16) బట్టే క్రీస్తు సంఘము (ఎపేసి 1:23; రోమా 16:16) చేర్చబడుటకు మీ హృదయములును త్రిప్పుకొనుడి. మీకు తెలియక మీలో కొందఱు బోధకులు "వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు" (1 కోరింది 3:11) ఈ క్రమము విడిచి సొంతముగా సంఘములును స్తాపించుకుంటున్నారు. మీరు అయన మాటలకి లోబడి "మీ యొక్క వ్యర్థ ఆరాధన" (మతాయి 15:9) విడిచి పెట్టి.. క్రీస్తు సంఘముగా చేర్చబడుటకు ఆలోచన కలిగి మన తండ్రినైన దేవుడును "ఆత్మతోను, సత్యతోను ఆరాధన" (యోహాను  4:24)చేయవలెను అని మిమ్మలి ప్రేమతో కోరుతున్నా..

★  ప్రియులారా, నీవు ఒక "క్రీస్తు సంఘము" (Church of Christ) చెందిన వారు అయితే మీకు మన ప్రభువునైన యేసుక్రీస్తు నామములో వందనములు.

మీరు "ఆత్మతోను, సత్యతోను ఆరాధన" (యెహోను 4:24) చేయుచు, సమాజముగా కూడుట మానక (హైబ్రీ 10:25), ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై (రోమా 12:11), మొదటగా నీకు నీవే బోధ చేసుకొనుచు (రోమా 2:21), పరిశుద్ధలకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటము చేయుచు (యుదా 1:3) అన్యులకి సువార్త ప్రకటన చేయు విషయములోను, మత శాఖలకి "సత్యము" లేదా "మొదటి శతబ్దపు అపోస్తలుల బోధ" నేరిoపిచుట విషయములోను(2 తిమోతి 2:15), దేవుని యొక్క సత్య క్రియగా పెట్టుకొని (ఎపేసి 2:10), క్రీస్తు శరీరములో మంచి అవయవముగాను (1కోరింది 12:27), క్రీస్తు లాంటి కుమారులుగాను, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగాలి(ఎపేసి 1:3-4;1 పేతురు 2:3) అని మిమ్మలి క్రీస్తు నందు ప్రేమతో కోరుతున్నా...

గమనిక: సంఘము అంటే భవనము, కట్టడము, సంస్థ.. అని బైబిల్ సెలవు ఇవ్వలేదు. అటువంటి అపోహ కలిగి ఉంటే ఈ వచనములును పరిశీలన చేయగలరు. (ఎపేసి 1:23, కొలసి 1:18; 1 కోరింది 12:27).

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ 

"ఆత్మతోను", "సత్యముతోను" ఆరాధన చేయుట అనగా నేమి..?


"ఆత్మతోను", "సత్యముతోను"

ఆరాధన చేయుట అనగా నేమి..?


నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

యోహాను 4: 23-24
యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను "తండ్రిని" ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని "తండ్రి కోరుచున్నాడు" (మూలభాషలో-వెదుకుచున్నాడు).

దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను(in Spirit) సత్యముతోను(in Truth) ఆరాధింపవలెననెను.

నా ప్రియులారా, "యధార్ధమైన ఆరాధన" లేదా "సత్య ఆరాధన" ఎలా ఉండాలో, ఎవరు ఆరాధనకు ప్రాతుడు, ఎవరు యదార్ధ ఆరాధికులు వెదుకుచున్నారో అనే విశేష సంగతిని మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి పరిచయము చేశారు - (యోహాను 4:21-23).


❣ ఆరాధన చేయువారు ఎలా ఉండాలి..? (యథార్థముగా).
❣ ఆరాధన ఎలా చేయాలి..? (ఆత్మతోను, సత్యముతోను).
❣ ఆరాధన ఎవరుకి చేయాలి లేదా చెందాలి..? (తండ్రినైనా దేవుడు).

గమనిక: మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు ఆరాధనను కోరుకోలేదు.

పైన వచనములు ఆధారముగా ఈ మూడు ముఖ్యమైన సంగతులను మనము తెలుసుకోవలసిన అవసరము ఎంతో ఉంది.

● నేడు అనేక రకరకాలు ఆరాధనలు లోకములో జరుగుతున్నాయి అవి ఏమియు కూడా దేవునికి అంగీకరయోగ్యమైనవి కావు. మునుపు అంశములో మనము ఎన్ని రకాలు ఆరాధనలు ఉన్నాయో గ్రంధము నుండే  తెలుసుకున్నాము.

● మన ఆరాధన తండ్రినైనా దేవుడికి అంగీకరయోగ్యముగా ఉండాలి అని అనుకుంటే ఈ క్రింది విషయాలను ఆలోచన చేసి, అనుసరిచవలసిన అవసరము ఎంతో ఉంది.


"ఆత్మతోను" ఆరాధన


ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక "దేవుని యొక్క ఆత్మవలన (worship God in the Spirit) ఆరాధించుచు". - ఫిలిప్పీయులకు 3: 3 

◆ శరీరమును ఆధారము చేసుకొనక దేవుని ఆత్మ వలన అనగా పరిశుద్ధాత్మ ద్వారానే మనము తండ్రినైనా దేవుడును ఆరాధన చేయాలి. శరీరమును ఆస్పదము చేసుకునే వాడు దేవుని యొక్క ఆత్మ చేత ఆరాధన చేయలేడు.

మన తండ్రినైనా దేవుడు శరీరమును ఆస్పదము చేసుకునే వారితో సబంధము పెట్టుకోరు.

◆ "దేవుడు దీన మనస్సు గలవారితోను, వినయ మనస్సు గలవారు తోను మాత్రమే సబంధము పెట్టుకొనే మహోన్నతుడు" (యేషయా 57:15).

గమనిక: ఎందరు అయితే పాపక్షమపణ కొరకు మారుమనస్సు పొంది, బాప్తిస్మము పిమ్మట దేవుని ఆత్మను పొందుకొని (అపో.కార్య 2:38) ప్రభువు సంఘము చేర్చబడి (అపో.కార్య 2:47) దేవుని యొక్క ఆత్మ చేత ఎందురు అయితే తండ్రిని ఆరాధన చేస్తున్నారో వారు "*యధార్ధముగా తండ్రిని ఆత్మతోను ఆరాధన చేయువారు"*.


"సత్యముతోను" ఆరాధన 


"సత్యము" అనగా "యథార్థమైన, నిౙమైన".

యోహాను 17: 17,19, 21
సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; "నీ వాక్యమే సత్యము".

వారును "సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు" వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.

వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; "వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ" వలెనని వారికొరకును "ప్రార్థించుచున్నాను".

● పైన వచనములో మూడు ముఖ్యమైన విశేష సంగతులను మనము తెలుసుకోవాలి.

1)  శిష్యులు(అపోస్తలులు) ను యేసు వారు సత్యమందు ప్రతిష్ట చేసారు అని.
2)  దేవుని వాక్యమే సత్యము అని
3)  అపోస్తలులు ఆ సత్యమును ఎందరుకి ప్రకటన చేసారో వారు అందరూ ఆ బోధయందు ఏకమైయుండాలి అని.

● యదార్ధమైన ఆరాధికులు ఎల్లపుడు చెప్పబడిన లేదా వినిన సంగతులు పరిశుద్ధ లేఖనములును ఆలాగున్నవో, లేవో పరిశోధన చేయువారుగానే ఆసక్తి కలిగి ఉంటారు (అపో.కార్య. 17:11).


• యేసు సాక్ష్యము •

❣ నేను దేవుని యొద్ద వినిన సత్యమును మీకు బోధిస్తున్నా. - (యోహాను 8:26)
❣ దేవుని వలన వినిన సత్యము - (యోహాను 8:40)
❣ నా తండ్రి వలన వినిన సత్యము - (యోహాను 15:15).

◆ ఆ సత్యమును యేసు వారు అపోస్తలులుకి ఇచ్చి వారుని సత్యమందు ప్రతిష్ట చేసారు. (యోహాను 17:19).


అపోస్తలులు సాక్ష్యము •

❣ జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, "మేమేది వింటిమో".... అది మీకు తెలియజేయుచున్నాము. - (1 యోహాను. 1:1).
❣ "....మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను(పారంపర్యములను) చేపట్టుడి". - ( 2థెస్స. 2: 15).
❣ "....సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము". - ( 2కోరింథీ. 13: 8).


గమనిక: యేసు ద్వారా ప్రతిష్ట చేయబడిన ఆ సత్యము అనగా అపోస్తలులు బోధ యందు ఉంటూ వారు తెలియపరిచిన ప్రకారముగా ఎందరు అయితే  లోబడి దేవుని ఆరాధన చేయు కార్యక్రముము వారు మాటలు ద్వారా ఎందరూ అయితే అనుసరిస్తూ ఆరాధన చేస్తున్నారో వారె "యధార్ధముగా తండ్రిని సత్యముతోను ఆరాధన చేయువారు".


ఈ క్రింది అంశములు ప్రతి వారు యొక్క ఆరాధనలో భాగములో ఖచితముగా ఉండాలి 

◆ అపొస్తలుల బోధయందును, -- (యోహాను 17:14, 17-21; అపో.కార్య 2:42; 2 దెస్స 2:15).
◆ సహవాసమందును, -- (హెబ్రీ 10:23-24; 1 కోరింది 7:24; 1 యోహాను 1:3).
 రొట్టె విరుచుటయందును, -- (అపో.కార్య. 20:7; 1 కోరింది 11:23-29).
◆ ప్రార్థన చేయుటయందును, -- (యోహాను 16:23; 1తిమోతి 2:1,8).
◆ పాటలు (ఎపేసి 5:19; కొలసి 3:16; హెబ్రీ 13:15).
◆ కానుకులు -- (1 కోరింది 16:1-2; 2 కోరింది 9:7).

(మీ ఆరాధన క్రమములో పైన తెలిపిన ఏ ఒక్క అంశము లేకపోయినా అది యదార్ధమైన ఆరాధన కాదు).

👊 హెచ్చరిక - పైన తెలిపిన ప్రతి అంశము యందు కూడా యదార్ధమైన ఆరాధికుడు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధన చేయవలసిన అవసరం ఎంతో ఉంది.

"క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?" మరియు "ఎప్పుడు చేయాలి"..?

"క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?" మరియు "ఎప్పుడు చేయాలి"..?

💌 అంశము: "క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?" మరియు "ఎప్పుడు చేయాలి"..? 


నా తోటి అమూల్యమైన విశ్వాసము పొందినవారికి మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము(OT & NT) 'లో' పలురకాల పండుగలను మనము చూడగలము. వాటిని మనము వాక్య పరిశీలన చేసిన పిమ్మట క్రైస్తవుడు ఏ పండుగను చేయాలి? అనే ఒక నిర్ధారణకి వద్దాము.

📚  పాత నిబంధన పండుగలు 📚

👉 "పస్కా పండుగ" లేదా "పులియని రొట్టెలు పండుగ" - ( లేవి 23:5; నిర్గమ 12:1-27; లుకా 22:1 ).
👉 "ప్రథమ ఫలములు పండుగ" లేదా "పెంతుకోస్తు పండుగ"- (లేవి 23:9-21; నిర్గమ 34:22; అపో.కార్య 2:1-2).
👉 "జ్ఞాపకార్ద శృంగధ్వని పండుగ" - (లేవి 23:23-25).
👉 పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ - (లేవి 23:26-32).
👉 "పర్ణశాల పండుగ" లేదా "గుడారాల  పండుగ" - (లేవి 23:33-35, 39-44).....etc

* గమనిక: (మరి కొన్ని పండుగలు కలవు).

📢 ఒక్కొక పండుగ గూర్చి ఒక్కొక ఉదేశ్యము కలదు.
📢 పైన తెలిపిన ఆ పండుగలు అన్నిటిని గూర్చి నేను వివరణ ఇవ్వడము లేదు కానీ ఆయా పండుగలును మోషే ద్వారా "ఇశ్రాయేల్ ప్రజలకి" లేదా "యాకోబు 12 గోత్రముల ప్రజలకి" నిత్యమైన కట్టడగా మన తండ్రియైన దేవుడు ఇచ్చారు".
📢 వారికి ఇవ్వబడిన పండుగల విషయములో ఉల్లగించుట చేత దేవుడు కోపముతో పలికిన మాటలు
"మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను". -  (ఆమోసు 5:21).

📖 క్రొత్త నిబంధన పండుగలు 📖

యేసు మరణము, సమాధి, పునరుత్థానము,(1 కోరింది 15:3-4) సంఘముస్థాపన (అపో.కార్య. 2:41-42) పిమ్మట క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చింది.

👉 "పులియని రొట్టె'తో' పండుగ" లేదా "ప్రభువు బల్ల" - (1 కోరింది 5:7-8; 10:21; 11:23-29).


💎 హెచ్చరిక:
గుడ్ ఫ్రైడే, మట్టల ఆదివారం, ఈస్టర్, సమాధులు పండుగ, క్రిస్టమస్... etc ఈ పండుగలును పరిశుద్ధ గ్రంథములో ఇప్పటికి నేను చూడలేదు. కారణము ఇవి అన్నియు మానవ యోచన వలనే కలిగాయి. దేవుడు వీటిని చేయమని మనకు కట్టడగా ఇచ్చినట్టుగా బైబిల్ లో ఒక్క వాక్య ఆధారము కూడా లేదు.

💌 "క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?

* "మొట్ట మొదట" అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. - (అపో.కార్య 11:26)

* క్రైస్తవుడు "పులియని రొట్టెతో పండుగను ఆచరింతము" లేదా "ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి". - (1 కోరింది 5:7-8; 10:21; 11:23-29).

💡 పాత నిబంధనలో పస్కా పశువుగా "గొఱ్ఱె పిల్లను, మేక పిల్లను" బలి ఇవ్వవలసిన అవసరము ఉంది. - (నిర్గమ 12:3-4 & 21).
💡 క్రొత్త నిబంధనలో పస్కా పశువుగా "క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను" - (1 కోరింది 5:7; యెషయా 53:7; అపో.కార్య. 8:32; ప్రకటన 5:10)

📖❣ క్రీస్తు శరీరము(బలి), రక్తము సూచనగా రొట్టె, ద్రాక్ష రసమును క్రైస్తవుడు జ్ఞాపకము చేసుకోనుటయే "పులియని రొట్టతో పండుగ" లేదా "ప్రభువు బల్ల కార్యక్రమము"  - (1 కోరింది 11:23-29; మత్తయి 26:26-29; మార్క 14:22-25; లుకా 22:17- 21) ❣📖

💌 "క్రైస్తవుడు, ఈ పండుగను ఎపుడు చేయాలి"..?.

👉 యేసు పునరుత్థాన దినము అనగా ఆదివారము నాడు క్రైస్తవులు ఆ పండుగను లేదా ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి. -  (మత్తయి 28:1; మార్క్ 16:2; లుకా 24:1; యోహాను 20:1).

👉 "నా శరీరము"; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
👉 "నా రక్తము" వలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. - (1 కోరింది 11:24-25).

👉 "సంఘము స్థాపన" మరియు "రొట్టె విరుచుటకు కూడుకున్న దినము" - (అపో.కార్య. 2:42; 20:7).

💎 గమనిక: ఆదిమ సంఘము వారు ఆదివారము నాడే రొట్టె విరుచుట లేదా పులియని రొట్టె'తో' పండుగ లేదా ప్రభువు బల్ల కార్యక్రముము యెడతెగక చేశారు.
💎 ఆదిమ క్రైస్తవులు సవoత్సరము ఒక్కసారి అని, ఈస్టర్ పేరుతో, మరో విషయములో వారు అయోగ్యముగా ఆ పండుగను జరుపలేదు.
💎 ఎందరైతే ప్రభువు యొక్క రొట్టెను, పాత్ర లోనిది అయోగ్యముగా తీసుకొంటారో వారు దేవుని దృష్టిలో అపరాధియగును - (1 కొరింధీ 11:27).

నా ప్రియులారా, ఓపికతో చదివి, వాక్య పరిశీలన చేసి సత్యమును గ్రహిచినందుకు మరో సారి మీకు నా వందనములు. - (ఫిలిప్పీ 4: 21).
The churches of Christ greet you - Roma 16:16